Thursday, March 28, 2024

 

                                                   శీలము 

          విద్యా విధానమనగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది వ్యక్తి  శీలము.  ఇది అంటే శీలము విద్యలో భాగము కాదా?

          విద్య వినయాన్ని ఇస్తుందని మన పూర్వీకులు చెప్పినారు. ఈ నాడు ఈ మాట నిజమేనా?

          ఎక్కడో  ఏదో పొరపాటు జరిగినది.  మన యొక్క పద జాలము యొక్క అర్థాలు మారి పోయినాయి.

          కొన్ని ఏండ్ల క్రిందట గ్రంథాలయము లో కూర్చుని వార్తా పత్రిక చదువుతున్నాను. ఇరువురి మధ్య తీవ్రముగా ఏదో చర్చ జరుగుతున్నది. క్రమ క్రమముగా కంఠము యొక్క తీవ్రత పెరిగింది.  వాళ్ళ చర్చను నేను కూడా వినడము మొదలు పెట్టినాను. ఒక రచయిత్రి గురించి  చర్చ చాలా తీవ్రముగా జరుగుతున్నది.  వ్యక్తిగతముగా శీలమును వదిలి వేసిన ఒక రచయిత్రి తన రచనల ద్వారా ఎన్ని నీతులు చెప్పినా సమాజానికి ఒరిగేదేమిటి? ఇది మొదటి వాడి  ప్రశ్న. వ్యక్తిగత  విషయములతో మనకు సంబంధము లేదు.  ఆమె చేసిన అద్భుత మయిన సమాజానికి పనికి వచ్చే  రచనలను మాత్రమే మనము పట్టించుకోవాలి. ఇది రెండవ వ్యక్తి యొక్క వాదన. ఇద్దరూ జుట్టు పట్టుకొని పట్టుకొనే స్థాయికి వస్తే  చుట్టూ పక్కల వారు అందరూ వారికి సర్ది చెప్పి పంపించి వేసినారు.

          ఆ సమయములో  నాకొక సంఘటన గుర్తుకు వచ్చింది. నా చిన్నప్పుడు (అప్పుడు నేను ఏడవ తరగతిలో ఉన్నాను.)నా కొక సైన్స్  మాస్టారు ఉండే వారు. సైన్స్  పాఠాలు అద్భుతముగా చెప్పే వారు. పిల్లలు నిశ్శబ్దముగా వినే వారు. ఒక సారి అతడి వ్యక్తిగత జీవితములో కొన్ని దురదృష్ట కర  సంఘటనలు జరిగినాయి. అంతే , అతడు పాఠాలు ఎంత బాగా చెబుతున్నా పిల్లలు వినడము మానేసి గొడవ చేయడము మొదలు పెట్టినారు. దీనిని  ఏమిటంటారు?

          మనము ఎన్ని  నీతులు చెప్పినా  విద్యార్థులు శ్రద్ధగా వింటారు. మనమీ వాటిని అనుసరించటము లేదని తెలిసిన తరువాత  మన మాట వారు వినరు. అవసరమయితే వినినట్లు  నటిస్తారు.

          “సారా  జహామ్  సే  అచ్ఛా  హిందూ సీతాన్   హమారా “ అన్నాడు ఇక్బాల్ మహా కవి. కానీ, తాను  అని మాత్రము పాకిస్తాన్ వెళ్ళి పోయినాడు.  బంకిమ్ బాబు తన ఆనంద మఠం రచనలో  వన్డే  మాతరం అని  దేశ ప్రేమికులచేత పాదిస్తాడు.  తన జీవితములో దేశ ప్రేమికుడిగా జీవించినాడు. అందుకే వన్డే మాతరమ్  గీతము స్థాయి  మొదటి దానికి రాదు.

          ఇవన్నీ గమనిస్తే మన కొక   విషయము తెలుస్తుంది. శీలము లేని వాడు నటిస్తాడు,శీలమున్న వాడు జీవిస్తాడు. మనకు కావలసింది నటనా లేక జీవితమా?

 

                          

                            అభిప్రాయము

నన్ను  గతములో , వర్తమానములో  నడిపించిన  మరియు  భవిష్యత్తులో నడిపించే  మహాత్ములకు  పెక్కునమస్కారములు.

పల్లెటూరిలో పుట్టి రాకృతి  రసాస్వాదన  చేస్తూ  అనుక్షణము  కొత్త కొత్త మార్పులను ఎదుర్కొంటూ 13 జూన్  నెల  శ్రీముఖ జ్యేష్ట శుద్ద  నవమి నాడు ఇది వ్రాయుటను మొదలు పెట్టాను. దీని తరువాత చాలా వ్యాసాలు వ్రాసాను. వాటిని  నా బ్లాగ్ లోని వ్యాసాల సంపుటి లో పెట్టడము కూడా జరిగినది. కానీ దీనిని పట్టించు కొ లేదు. ఇటీవలే దీనిని  తయారు చేయడము మొదలు పెట్టినాను.

ఈ నాడు  రతి యొక్కరూ  అంటే  నేను, నీవు  మరి ఎందరో అందరికీ ఒక అలవాటు అయింది. అలా చెప్పుకుంటున్నారు, ఈ లోకము పాడయి  పోయిందనీ, ప్రతి యొక్కరిలో స్వార్థము  పెరిగిపోయిందని,  అలా చెప్పడము తో తమ భాధ్యత తీరిపోయిందనీ  అనుకుంటున్నారు, లేదా భాధ్యత నుండి తప్పుకుంటున్నారు.

గౌతమ బుద్ధుడిని, కొంత మంది ప్రశ్నించి  నారుట, “మరణానంతరము జీవితమునడా?” అని. “ముందు ఈ జీవితమును పట్టించుకొనన్ది.’ అని చెప్పినారుట. మిగిలిన  లేదా  అనవసర ఆలోచనలు ఇప్పుడు అనవసరమన్నట్లు.  వచ్చిన వారు వెంటనే తమ  చిట్టా లో వ్రాసుకున్నారుట,” మరణానంతర జీవితము లేదని బుద్ధుడు చెప్పినాదని.” ఇక బుద్ధుడి పేరు మీద ఉన్న జాతక కథలు మరణానంతర/పునర్జన్మను సూచిస్తున్నాయన్న విషయాన్ని వారు మరిచి పోయినారు. లలిత విస్తారమనే బౌద్ధ గ్రంథములో తన గత జన్మ గురించి బుద్ధుడు ప్రస్తావించినట్లు ఉన్నది. బౌద్ధ గరువులు(టిబెటన్ లామాలు) తరచుగా పునర్జన్మ గురించి ప్రస్తావిస్తారు. కానీ బుద్ధుడి ఆలోచన ప్రకారము, మరణమూకంటే  ముందు తరువాత ఏమీ ఉండదని హడావుడి చేసి చెప్పేస్తారు మన దార్శనీకులు మరియు చరిత్ర కారులు. 

పూర్వ కాలములో గురువులు శిష్యులకు ఎంత అవసరమో అంతా వరకే  బోధించే వారు. కానీ, ఈ నాటి శిష్యులు “గురువు గారు! మీరు చెప్పగలిగినంత వరకూ చెప్పండి, ఎరుకొన గల్గినన్న విషయాలను మేమే వేరుకుంటామని అంటున్నారు. వీరే అసలాయిన గురువును మించిన శిష్యులు. శిష్యులకు ఏమి  ఇవ్వాలో తెలియని గురువులు, గురువుకే పాఠాలను చెప్పాలనుకొనే శిష్యులు , ఇదీ మన నూతన విద్యా విధానములో మార్పు, ఇలాగే నడుస్తూ ఉంది.

నా చిన్నప్పుడు గోడల మీద విద్యార్థి సంఘాలు కొన్ని నినాదాలు వ్రాసినాయి. అవి ఏమిటంటే,

1.     మాకు శాస్త్రీయ విద్యా విధానము కావాల.

2.    విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20 ఉండాలి.

మొదట ఇదేనా శాస్త్రీయ విద్యా విధానము అని అనిపించినది. తరువాత అర్థమయింది, ఇది గాని వస్తే నేర్చుకొనే విషయాలు ఏమయినా నిరుద్యోగ సమస్య మాత్రము తీరిపోతుంది అని.

ఈ వ్యాసము కొంచెము అసంపూర్తిగా ఉంది.

 

Sunday, September 13, 2020

ద్రౌపది నవ్వింది

  


చాలా మందికి ఒక దురభిప్రాయముంది. మయ సభలో  నీళ్ళలో పడిన దుర్యోధనుడిని చూచి ద్రౌపది నవ్వడము వలననే  మహా భారత యుద్ధము లాంటి ప్రపంచ యుద్ధమునకు మొదటి మెట్టు పడింది అని. మహా భారత కర్త మహర్షి వేదవ్యాసుది మాటలలోనే నిజాన్ని తెలుసుకుందాము.

మహా భారతాన్ని రచించిన మహర్షి కి తెలియని విషయము లేదు. అందుకే “వ్యాసోచ్చిష్టం  జగత్ సర్వం” అని అంటారు. ఈ విశ్వమంతా వ్యాసుడి ఎంగిలే అనే ఒకమాట. అంటే ప్రతి విషయమూ ఆయన నోటినుండే వచ్చింది అని మనము అర్థము చేసుకోవాలి.

ఇంకా ద్రౌపది అగ్ని నుండి పుట్టింది. అగ్ని పవిత్రతకు చిహ్నము. అంటే ఆమె ఎంత పవిత్రురాలో చెప్పనవసరము లేదు. అటువంటి ఆమె ఒక సభలో ఒకరు పడి పోవుట చూచి నవ్వుతుందా?

ఇంకా వ్యాస మహర్షి ఏమని వ్రాసినారో చూద్దాము. సభా పర్వము లోని డ్యూట పర్వములో

స కదాచిత్ సభా మధ్యే   ధార్త రాష్ట్రో మహేపతిః |

స్ఫాటికం  స్థల  మాసాద్య  జలమిత్యభి  శంకయా||

స్వ  వస్త్రోత్కర్షణం రాజా  కృతవాన్  బుద్ధి మోహితః |

దుర్మనా  విముఖశ్చైవా  పరి చక్రామ తాం సభాం ||

తతః స్థలే నిపతితః దుర్మనా వ్రీడితో నృపః |

నిః శ్వసన్ విముఖ  శ్చాపి పరి చక్రామ తాం సభాన్ ||

తతః స్ఫాటిక తోయాం వై  స్ఫాటికాంబుజ  శోభి తాన్ |

వాపీం మత్వా స్థల మివ స  వాసాః ప్రా పతజ్జలె ||

{సంక్షిప్తముగా}మయ సభలో స్ఫటిక మణులు  పొదిగిన స్థలములో  నీరున్నాదని భ్రమ పడి వస్త్రాన్ని ఎత్తి పట్టుకున్నాడు. తరువాత స్ఫటిక మణుల వలే స్వచ్చమయిన నీటి కొలనును స్థలమను కొని కట్టు బట్టలతో అందులో పడ్డాడు.

జలే  నిపతితం దృష్ట్వా భీమ సేనా మహా బలః|

జహాస జహసు శ్చైవ కింకరాశ్చ సుయోధనం||

వాసాంసిచ శుభాన్యస్మై ప్రదదూ రాజ శాసనాత్ |

తతాగతం తం దృష్ట్వా భీమ సేనో మహా బలః ||

అర్జునశ్వయనోచోభౌ  సర్వే తే ప్రాహ సంస్తదా|

నామర్షయాత్ తతస్తేషాం అపహాస మమర్షణః||౩-౯  శ్లోకాలు సభా పర్వములో ద్యూత పర్వము)

నీళ్ళలో పడిన దుర్యోధనుడిని చూచి, భీముడు, అతడి సేవకులు నవ్వినారు. రాజాజ్ఞను అనుసరించి వేరే వస్త్రములు ఈయ బడినవి. అతడి స్థితిని చూచి భీమార్జున నకుల సహా దేవులు నవ్వినారు. సహనము తక్కువయిన దుర్యోధనుడు  ఈ పరిహాసాన్ని సహించ లేక పోయినాడు. తరువాత తండ్రితో ఇలా చెబుతాడు.

పునశ్చ  తాదృసీమైవ  వాపీం జలజ శాలినీం|

మత్వా శిలా సమం తోయే పతిsతోస్మి  నరాధిప||

తత్ర మాం ప్రాహసత్  కృష్ణః  పార్థేన సహ సుస్వరం|

ద్రౌపదీ చ సహా స్త్రీ భిః వ్యథయంతి మనో మమ||{ద్యూ త పర్వము సర్గ ౫౦ శ్లోకాలు ౨౯-౩౦)

ఒక చోట కొలను చదును చేయబడిన స్థలముగా భావించి అందులో పడినపుడు తనను చూచి కృష్ణార్జునులు, ఇతర త్రీ పరివారముతో నున్నద్రౌపడి నవ్వారని చెబుతాడు.

అంతకు ముందు తను నీళ్ళలో పడుట చూచి భీముడు నవ్వినాడని, అప్పుడే  తను భీముడిని చంపి వేసే  వాడినని, శిశుపాలుడికి పట్టిని గతి గుర్త్కు వచ్చి భయ పడినానని చెబుతాడు.

దుర్యోధనుడు సహజముగా అసూయాపరుడు. రాజ సూయ యాగములో వచ్చిన కానుకలను స్వీకరించే భాద్యత అతడికి ఈయ బడినది. ఆ సంపదను గురించి తన తండ్రికి చెప్పిన విధానమే అతడు ఎంతగా అసూయా గ్రస్తు డయినాడో చెబుతుంది. అటువంటి మానసిక స్థితిలో అతడు మయ సభకు మరొక వ్యక్తీ కూడా తోడు లేకుండా వెళ్ళినాడు.  వివేకమును కోల్పోయి తను నీళ్ళలో పడడమే కాక గోడ లేదనుకొని గోడను కూడా కొట్టుకున్నాడు.

తనకు సహజంగా ఉన్న అసూయను ప్రస్ఫుటము చేయడానికి తనను చూచి కృష్ణుడు మాత్రమే కాక ద్రౌపది కూడా నవ్విందని చెప్పాడు. ఆ మాట వ్యాస మహర్షి చెప్ప లేదు.ద్రౌపది సంస్కారము కూడా అటువంటిది కాదు.

నన్నయ భట్టారకుడు ఆ విధముగా వ్రాయడములో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది.

మూల రచనలకు అనువాదాలకు తేడా ఉండటము మన భాషలో చాలా సార్లు జరిగింది. అటువంటి అపప్రథ ద్రౌపదికి రావడము మన దురదృష్టము.

          ఓం  శాంతి శాంతి  శాంతిః.

            *************************************************************

Friday, August 17, 2018

కాలోSహి దురతిక్రమః








               మహా భారతములో  ద్రుతరాష్ట్రుడు  తనకు జరిగిన విషాద సంఘటనలను సంజయుడికి  వెల్లడిస్తే  సంజయుడు ఇచ్చిన సమాధానమిది.

విదాతృ విహితం మార్గే                      న కశ్చిదతి వర్తతే
కాల  మూల మిదం  సర్వే                    భావా  భావౌ Sశుభా శుభౌ||

            అంటే బ్రహ్మ దేవుడి  విహిత  మార్గమునకు ఏదీ  వ్యతిరేకము కాదు. భావములో లేదా అభావములో (అంటే     లేమిలో ) సుఖములో  లేదా  కష్టములో  అంతా కాలమును అనుసరించి జరుగుతుంది.

కాలః  సృజతి భూతాని                        కాలం  సంహరతే  ప్రజాః
సంహరంతి ప్రజాః  కాలం                      కాలః  శమయతే  పునః||

          భూత  జాలాన్ని  కాలమే  సృష్టిస్తున్నది. జనాన్ని  కాలమే  హరిస్తున్నది. ప్రజలు  కాలాన్ని హరిస్తారు. తిరిగి కాలమే అన్నిటినీ  శాంత పరుస్తుంది.

అతీతా  నాగతా భావా                         ఏచ  వర్తంతి  సామ్ప్రతం
తాన్  కాల  నిర్మితాన్ భావాన్                  సంజ్ఞాం కర్తు మర్హసి||

       ఇప్పుడు  వర్తించే/వచ్చే  భావాలు ఊహించ లేనివి. అవి కాల నిర్మిత మయినవి. వాటిని సూచించుట వీలు  కాని  పని.

ఇవి కాలమును గూర్చి  మహా భారతములో ఉన్న మాటలు.ఇదే  భావమును Archibald Wheeler  తన  Gravitation పుస్తకములో  ఈ విధముగా వెల్లడించినాడు.
Time is awake when all things sleep
Time stands straight when all things fall.
Time shuts  in all and will not be shut.
Is, was and shall be are time’s children.
O  Reasoning, be witness, be stable.
·         Vyasa,  Maha Bharata

Monday, August 6, 2018

నిశ్చితార్థము




కొన్ని సంవత్సరాలు గడిస్తే  ఈ పదము ఎక్కడో విన్నట్లున్నదని జనము అనుకోవచ్చును. ఈ పెను మార్పులు జరిగితే  మన  సాంప్రదాయములో  కొన్ని విశేషాలు  కను మరుగు  అయ్యే పరిస్థితులు  ఏర్పడినాయి.


వివాహ క్రతువులో నిశ్చితార్థము ఒక భాగము.  ఈనాడు  పెళ్లి/వివాహము  చాలా మందికి ఒక వినోదము గా మాత్రమే మిగిలినది. అందులో  పురోహితుడి కంటే  ఫోటోగ్రాఫర్ ది పెద్ద పాత్ర. ఇంక పెద్దలు కాబోయే  వధూ వరుల  అంగీకారము తో  ఈ వివాహము జరుపుటకు  నిశ్చయించ  బడినదన్న సంకేతముగా మంగళ  సామగ్రిని  రెండు భాగస్వామ్య  కుటుంబాలు ఇచ్చి పుచ్చుకోవడాన్ని నిశ్చితార్థము అని  అంటారు. ఆర్ధిక పరపతి ఉన్న వారు దీనిని కూడా పెళ్ళి అన్నంత వేడుకగా  జరపడము కద్దు. దురదృష్ట మేమిటంటే ఇందులో  ఆడంబరాలకే ప్రాధాన్యతను స్తున్నారు.

రెండు కుటుంబాల మధ్య సంబంధాలను ఏర్పరచేది పెళ్లి. వధూ వరులు అందుకు కట్టుబడి ఉండటానికి  నిర్ణయము తీసుకుంటారు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒక సినిమా లో  నిశ్చితార్థము అయిన తరువాత  కథా నాయిక “నాకు ఇంకొకరి మీద మనసు పోయింది” అని చెబుతుంది. అందులో ఇంకొక పాత్ర చెబ్తుంది,”ఎవరికీ ఎప్పుడు ఎవరి మీద మనస్సు వెళుతుందో” చెప్ప లేమని అంటుంది. ఇంక నిశ్చితార్థము విలువ ఏమిటి? పెళ్ళయిన అరువాట కూడా మనస్సు వెల్ల వచ్చు కదా? అందుకు కూడా అంగీకరిస్తామా?

దీనికి పైన ఇంకో మెట్టు.ఒక సినిమా లో కథా నాయిక  ఒక సంగీత వాద్య కారుది మీద  మనస్సు పారేసుకుంటుంది.వేదం పండితుల కుటుంబములో పుట్టిన ఆమెను మరొక  వేదం పండితుడికి ఇచ్చి పెళ్లి  చేస్తారు. సమాగమ సమయములో  వరుడికి ఆమె శక్తి స్వరూపిణిగా  కాన బడుతుందిట. కారణ మొకటే, ఆమె మనస్సు ఈయన మీద లేదు. ఆ విధముగా  ఆమె పరస్త్రీ అయింది. అందుకే ఆమె శక్తి స్వరూపిణిగా  కనిపించింది. అయితే ఒక ప్రశ్న మిగిలి యుండి.  పాణి గ్రహనములో చేయి పట్టుకున్నపుడే  లేదా మంగళ సూత్రా ధారణ సమయము లోనే ఎందుకలా జరగ లేదు. ఒక ప్రముఖ  దర్శకుడి సినిమా చూసినపుడు నాకు వచ్చిన ప్రశ్న ఇది.

ఇది ఆ రెండు సినిమాలేక్ పరిమితము కాదు. ఇంకా చాలా సినిమాలలో టీవీ  సీరియల్స్  లో నిశ్చితార్థము అయి పోయి తరువాత వధువు  మనస్సు మారి పోవడము చూపిస్తున్నారు. హీరో ల కంటే  ఆ కథా రచయితలు పెద్ద హీరో లు అవుతున్నారు. జనానికి తెలియని విశేషాలు కొన్ని ఉన్నాయి  సావిత్రి సత్యవంతుడు చని పోతాడని తెలిసి కూడా  పెద్ద వాళ్ళను  ఒప్పించి, ఆయననే పెళ్లి చేసుకొని, ఆయన కోసమే పోరాడుతుంది. మరి ఈ తరము వారు,పెళ్ళికి ముందే  కాబోయే మొగుడు మొహాన మొత్తినట్లని పించడము, ప్రేమ కంటే వ్యామొహానికిఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, నిస్చితార్తాలు విస్చిన్నాము కావడము జరుగుతున్నది.

దీనిని విప్లవాత్మకముగా  నిర్మాతలు భావిస్తే అది ప్రజల కర్మ.  ప్రజలు ఎదో ఒక రోజు ఈ విప్లవాన్ని తిరస్కరిస్తే అది నిర్మాతల కర్మ. నిర్ణయాన్నికాలానికే వదిలి వేద్దాము.

Wednesday, February 8, 2017

మన చరిత్ర6

          
గ్రీకుల ప్రాచీన చరిత్ర

అతి ప్రాచీనమయిన  యూరోపియన్ సాంస్కృతిక వ్యవస్థ గ్రీకులకే చెందుతుంది. ఈజిప్టు దేశపు ఔన్నత్యపు ఆఖరి దశలో  సుమారుగా క్రీ పూ ౧౧ వ శతాబ్దములో గ్రీకుల నాగరికత మొదలయింది.ఇక క్రీ శ ౪ వ శతాబ్దము వరకు బ్రిటిష్ వారికి చరిత్రే లేదు.  ౧౧ వ శతాబ్దము వరకు ఉన్న చరిత్ర కూడా నామ మాత్రమె. మనకు తెలిసిన విస్తారమయిన బ్రిటిష్ చరిత్ర నార్మనుల దండ యాత్రనుంది మాత్రమె. పెక్కు యూరప్ దేశాలలో మానవుడు ఆదిమ మానవుడిలా బ్రతుకు తున్నాడు. రోమన్ నాగరికత ఇంకా తలెత్త లేదు. ఈజిప్టు చాలా ఉన్నత స్థితిలో ఉన్నది. అటువంటి దశ లో గ్రీకు నాగరికత యొక్క శైశవ దశ మొదలయినది.
మధ్యధరా సముద్రము లోని  క్రీత్స్/కృతి  ద్వీపము నుండి టర్కీ తీరము వరకు గ్రీకు సామ్రాజ్యము వ్యాపించినది. ఎథెన్స్ (అధీన) నగరము కళలకు కేంద్రమై విలసిల్లినది. హఠాత్తుగా తలెత్తిన ఈ నాగరికతకు ప్రేరేపణ ఏమిటి? వారి సంస్కృతి ఎటువంటిది?
ఎన్ సైక్లో పేడియా బ్రిటానికా లో ఇలా ఉంది.”యూదుల వలే వారు కూడా తాము తిరిగి వెళ్ళుటకు  ఉవ్విళ్ళూరే మాతృ దేశమును హృదయాంతరాళాలలో దాచి యుంచినారు. ఆ మాతృ భూమిని గురించి వారెన్నో గీతాలు ఆలాపిస్తూ ఉంటారు.”
ఆ పుస్తకములో ఇంకా ఇలా ఉన్నది. “దొరియన్లు క్రీ పూ ౧౧ వ శతాబ్దములో  దాడి చేసినారు. గ్రీకుల కళా కౌశలములు వెల్లి విరిసినది ఈ దాడుల తరువాతనే. సుమారుగా క్రీ పూ ౯౦౦ సంవత్సరములో గ్రీకు ప్రపంచములో ఎథెన్స్ ఒక సాంస్కృతిక  కేంద్రముగా విలసిల్లినది.
స్వర్ణము, స్వర్ణ కారులు తక్కువగనే ఉన్నారు. తూర్పు దేశాలనుండి వచ్చిన స్వర్ణ కారులు  అట్టికా లో ఉన్నారు. ప్రాంతీయ స్వర్ణ కారులు కొద్ది మంది మాత్రమె. లెవ్ కాండి దగ్గిర, చాల్సిస్  ఎరిట్రియల మధ్య లెలాంటిన్ మైదానాలలో  లోహపు పరిశ్రమకు సమీప ప్రాచ్య దేశాలతో వ్యాపారమునకు చక్కని రుజువులు కనిపించినవి. ఆ నగరములు క్రీ పూ ౭౦౦ లో పూర్తిగా ధ్వంసము చేయ బడినవి.”
పై సమాచారమును అనుసరించి వేరే సంస్కృతిని  అనుసరించు వారు దాడులు చేసిన తరువాత మాత్రమె గ్రీకుల చరిత్ర  మహోన్నత వైభవ స్థితిని అందుకొన్నదని తెలుస్తున్నది. ఈ దాడులు చేసిందెవరు? ఆక్సస్స్ నదీ తీరమునుండి వచ్చిన ఆర్యులా? యూరప్ లోని దేశ ద్రిమ్మరులా?
ప్రాచీన గ్రీకు చరిత్ర అంటే ప్రాచీన భారత దేశ  చరిత్ర అంటారు పోకాక్ మహాశయులు తన  India in Greece  అనే పుస్తకములో. ఈ మాట అందరికీ ఆశ్చర్యము కలిగించ వచ్చును. కానీ నిజము తెలియాలంటే  ఆయన చెప్పిన మాటలు కూడా పూర్తిగా వినాలి.
“ఆమె(గ్రీకు దేశము) తన భాష మాత్రమె కాదు. తన వేదాంతము, తన ధర్మమూ, తన నదులు, తన పర్వతాలు, తన తెగలు, తన ఆలోచనలలో మార్పులు, తన రాజకీయ జీవితమూ.... ఎలాంటి సంశయము లేకుండా తను భారత దేశము యొక్క పరిపాలనలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తాయి.
పశ్చిమ భారత దేశములో మాయమయిన ప్రతి వంశ వృక్షము గ్రీసులో ప్రత్యక్షమయినది.  గ్రీకుల భౌగోళిక స్థితుల గురించి వ్రాసిన Strabo అబంటిస్ అనే పేరును గురించి వివరిస్తూ వారు ఫోశియన్ నగరములో స్థిర బడి  “అబే”నగరమును  నిర్మించినారని, తరువాత యుబోకా  కు తరలి వెల్లినారని, అందు వలన అబంటేస్ గా పిలువ బడినారని వ్రాసినారు. కానీ “అబే” పదము యొక్క వ్యుత్పత్తిని తెలుప లేక పోయినారు. అయినప్పటికీ ఈ తెగలు ధైర్య, స్థైర్య  వంతులయిన వీరులుగా ట్రాయి నగర్ మైదానాలలో పేరు గాంచినారు. ( హోమర్  ఇల్లియాద్ లో వారి ధైర్య సాహసాలను, నిజాయితీని గురించి ప్రస్తావించినారు)  వారి అసలు జన్మ స్థానమును  గురించి న్యాయము జరుగ వలసి యున్నది. రాజస్థాన్ రాజ వంశావళి (బార్డ్స్)ను చరిత్ర కాదని నిర్ణయించి చరిత్ర కారులు ఈ ప్రాచీన తెగ యొక్క వంశ వృక్షమును తెలుసుకొనే అవకాశము లేకుండా చేసినారు. అబంటీస్ మాళ్వుల యొక్క అవంతికి చెందిన రాజ పుత్ర తెగకు చెందిన వారు. “
పోకాక్ ఇంకా ఇలా న్నారు.”క్రీ పూ ౭౦౦ కు చెందిన గ్రీకు  పలాస్గాన్ మహా రాజు పాలిస్తాన్ రాజ కుమారుడు. పాలిస్తాన్ అంటే పాలీ దేశము లేదా మగధ.”
“అతి ప్రముఖముగా చెప్ప బడిన ట్రోజన్ (ట్రాయి) నగరపు గోడలు పలాస్గయన్ల చేత లేదా సైక్లోపుల చేత నిర్మించ బడినవి. ఆ గోడలను నిర్మించిన కాలానికి హోమర్ పుట్ట లేదు. ఆ కాలములో పలాస(పాలి) గ్రీస్ లో మాట్లాడ బడుతూ ఉండేది. సైక్లోపులు అనే పదము గోక్లోపులు అనే పదమునుండి వచ్చినది. ఈ గోక్లోపుకు మూల పదము గోకుల ప్రముఖ్. వారు యమునా నదీ తెరమున గోకుల దేశములో నివసించిన ప్రముఖులు. ఇది కృష్ణుడు బాల్యములో గడిపిన ప్రదేశము.”
పై మాటలను భారతీయులెవరూ చెప్పా లేదు. ఇంకా గ్రీసు లో మొదట స్థిర పడిన వారిని ఎజియన్లని లేదా డానా లు అని పిలిచే వారు. వీరు దనువు వంశ పరంపరలో వచ్చిన వారు. వీరు దానవులని పిలువ బడే వారు. వారి ప్రత్యేక సంస్కృతి కూడా ఇల్లియద్ లో కాన బడుతుంది.
హెలెన్ అతి లోక సౌందర్యవతి. ఆమె భర్త అయిన మేనేలాస్ కు అతిథి గా వచ్చిన పారిస్ రాకుమారుడి వ్యామోహములో పడుతుంది. ఈ విషయములో పారిస్ ఎటువంటి వ్యతిరేకతను వ్యక్తము చేయ లేదు. ఇద్దరూ రహస్యముగా ఎజియన్ సముద్రము దాటి ట్రాయి నగరమును చేరుకున్నారు.
గ్ర్రేస్ ఒక దేశముగా కనిపించదు. అందులో ఉన్న చిన్న చిన్న పాలకులు ఒకటయినారు. వారి నాయకుడు ఆగమేమ్నన్. వారిలో ఆకిలీజ్ మహా వీరుడు. ఈ సైన్య బృందము తన యుద్ధ యాత్రలో దారిలో ఉన్న గ్రామాలను కొల్ల గోడుతారు. అందమయిన అమ్మాయిలను చెర బడుతారు. చివరకు ఇద్దరు అమ్మాయిల విషయములో ఆగమేమ్నాన్  ఆకిలీజ్ ల మధ్య ద్వేషము ఏర్పడి, ఆకిలీజ్ యుద్ధ రంగమునుండి వెలుపలికి వచ్చేస్తాడు. ఇందులో మనము నీతి/నియమములు లేని ఒక ఆదిమ జాతిని , వారు చేసే ఆకృత్యాలను చూస్తాము.
ఇక ట్రాయి నగర పాలకుడు ప్రయాం.  అతడి పెద్ద కుమారుడు హెక్టార్. హెక్టార్ తన తమ్ముడు పారిస్ చేసిన పనిని నిరసిస్తాడు. కానీ వీలు లేని పరిస్థితులలో రాజ్య  రక్షణ భాధ్యతలో ఉంది పోతాడు. హోమర్ రచనను అనుసరించి ట్రాయి నగరములో రాజ వంశీకుల మీద నగరములో అపరిమితమయిన గౌరవము కనిపిస్తుంది. చక్కని వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇక హెలెన్  చాంచల్యానికి ప్రతీక. హోమర్ ద్వారా రాజకుటుంబమును గురించి తెలుసుకున్న ప్రతియొక్కరికి  రాజ కుటుంబము మీద ఏర్పడిన గౌరవము ఎజియన్ల/గ్రీకుల మీద ఏర్పడదు. చని పోయిన రాజ కుటుంబీకులకు, ముఖ్యముగా హెక్టార్ కు దహన సంస్కారము చేయుటకు రాజ కుటుంబీకులు పడిన తపన ఒక్క సారి భారత సంస్కృతిని గుర్తుకు తెస్తుంది. హెక్టార్ మహా వీరుడు. ఏనాడూ యుద్ధ రంగములో వెనుకకు తిరుగ లేదు. అతని ధాటికి తట్టుకోలేని శత్రు సైన్యము చేత మోసము చేత చంప బడినాడు. బహుశా పోకాక్ హెక్టార్ లో ఒక మాళ్వ రస పుత్రా వీరుడిని చూచినాడేమో?

ఎజియన్ /గ్రీకు వీరులు వేర్వేరు ప్రాంతాల వారయినప్పటికి వారి ప్రధాన ఉద్దేశ్యము ట్రాయి నగర విధ్వంసమే. బాగా ప్రగతి సాధించిన ట్రోజన్ నగరము గ్రీకుల ఆధీనము లోనికి వచ్చినది. తరువాతి కాలములో వారి ప్రభావమే గ్రీకుల నాగరికతకు మెరుగులు పెట్టినది. ఇటువంటి జాతి మాత్రమె తమ పవిత్ర భూమికి తిరిగి వెళ్లాలని జానపద గీతాలు పాడుతున్నదేమో? నిజాయితీ గలిగిన చరిత్ర కారులు  నిజాన్ని తెలుసుకోవాలి.
This closes the series on our history

Friday, February 3, 2017

ఆర్యులు ఎక్కడినుండి వచ్చినారు?

                                                    
.


“వారాశించే దానిని  గూర్చి కలలు కంటారు. ఆ కలలే నిజమని నమ్ముతారు” అంటారు చిల్లింగ్ వర్త్. .”భారతీయులలో మానసిక విభజనను కోరిన వారు ఆర్య ద్రావిడ సిద్ధాంతమును ప్రతిపాదించినారు.  వారి ప్రతిపాదన  ప్రకారము ఈ దేశములో మొదట  తురీయులన బడే వారు ఉండే వారు. వారిని కొండల పైకి అడవుల లోనికి తరిమి వేసి, ద్రావిడులు  తమ కొత్త సంస్కృతిని ఏర్పరిచినారు. ఆర్యులు పశ్చిమ సరి హద్దుల నుండి వచ్చి, ద్రవిడుల నగరాలను ధ్వంసము చేసి, వారిని దక్షిణ దేశానికి తరిమి వేసినారు. ఈ విధముగా ఉత్తర భారతాన ఉన్న వారు ఆర్యులు, దక్షణాన ఉన్న వారు ద్రవిడులు మరియు కొండలలో కోనల్లో ఉన్న వారు తురీయులు. సుమారు క్రీ శ ౧౭౦౦ లో బాతిలోమ్ హసీ మేల్ బర్గ్ ఈ వాదనకు మూల పురుషుడు. ౧౮౨౪ లో  కాల్డ్వెల్ ఈ వాదనను సమర్థించినాడు. రెవరెండ్ పోప్ హ్యుజన్ హుల్స్ జ్యూవన్  బార్కీ , ఫాదర్  హెన్రీ మున్నగు వారు దీనిని ప్రచారము లోనికి తెచ్చినారు. సుమారుగా ౭౦౦ సంవత్సరాలు ముస్లిం పాలకులు సాధించ  లేని భారతీయ విభజనను బ్రిటిష్ వారు ౨౦౦ సంవత్సరాలలో  కొంత వరకు సాధించ గలిగినారు.
అస్సాం(అహోం)  లోని వారు పొట్టిగా ఉంటారు. పంజాబ్ వారు ఆజాను బాహులు.  కాశ్మీరము  వారు తెల్లగా అందముగా ఉంటారు. భూమధ్య రేఖకు దగ్గిరగా ఉన్న వారు  నల్లగా ఉంటారు. ఇన్ని రకాల ప్రజల సమాహారమే భారత దేశము. ఈ అందరికీ శ్రీ రామ చంద్రుడు మర్యాదా పురుషోత్తముడే, శ్రీ కృష్ణుడు మహాయోగి మాత్రమె గాక భక్త జన హృదయుడు.  మహాదేవుడు అందరికీ ఆరాధ్యనీయుడు. అందరూ అష్టాదశ పురాణాలనే చదువుతారు, ఆ పుణ్య క్షేత్రాలనే దర్శిస్తారు, ఆ నదుల లోనే స్నానము చేస్తారు. ఒక మాట చెప్పాలంటే నదుల స్నాన ఘట్టాలు, పుణ్య క్షేత్రాలు  అందరూ కలిసే కూడలి ప్రదేశాలు అయినాయి. రూపు రేఖలే మనుషుల ఔన్నత్యాని నిర్ణయిస్తాయన్న  వెఱ్ఱి భ్రమకు ఆర్య ద్రావిడ విభజన మరింత బలాన్ని చేకూర్చింది. సాధన లోనికి తీసుకొని రాలేని  శాస్త్రీయ  పరిజ్ఞానము ఎటువంటి వెఱ్ఱి తలలనైనా వేయించ గలదు. అన్నిటికీ ఫలితమొక్కటే. జాతీయ భావము స్థానములో బావ దాస్యము వేళ్ళూని నిలిచింది.
ఆర్యులు అందగాళ్ళు ఆజాను బాహులు, తెల్లగా ఉంటారు. ద్రవిడులు నల్లగాఉన్తారు, పొట్టిగా ఉంటారేమో? మరి ఆర్యులు/ద్రవిడులు ఆరాధించే రామ/కృష్ణుల యొక్క రంగేమిటి?తెలుపేనా? ద్రావిడ నాయకుడుగా పేర్కొన బడ్డ రావణుడు  ఎవరికీ పుట్టినాడు. ఆయన ఆరాధ్య దైవమెవరు? భాగవత పురాణములో చెప్ప బడి దక్షిణ భారత దేశాన్ని పాలించిన ద్రావిడుడు అను పేరు గల రాజు ఏ పరంపరనుండి వచ్చినాడు?
వాల్మికి రామాయణములో సీతా మాత శ్రీ రాముడిని ఆర్య పుత్రా! అని ఎన్నో సార్లు పిలిచినట్లు ఉంటుంది. మర్యాద పూర్వకముగా పిలుచుటకు ఉపయోగపడే ఆర్య శబ్దము జాతి పేరుగా మారినది. మరొక రాజు యొక్క పరిపాలనా క్షేత్రము ఆ ప్రాంత ప్రజల జాతి పేరుగా మారినది. మరి ప్రముఖ ద్రావిడ భాషగా చెప్ప బడుతున్న తమిళమునకు  వ్యాకరణ కర్త అయిన అగస్త్య ఋషి వర్యుడు  ద్రవిడుడా? వైదిక పరంపరలో కనిపించడా?
దేహమును మనస్సు  వేర్వేరుగా భావించిన పాశ్చాత్య  శాస్త్రజ్ఞుల లో కొందరు  మనస్సులో కలిగే తీవ్ర వికల్పములే భౌతికముగా  కాన్సర్ వ్యాధికి కారణమవుతుందని  గుర్తించినారు.  అటువంటి వారిలో కొందరు మానసిక సామీప్యత కంటే రూపు రేఖలే జాతిని  నిర్దేశిస్తాయని తెలుపుతూ  జాతి భేదమనే మరో కాన్సర్ ను ప్రవేశ పెట్టినారు. మనుషులను, మనుషుల బృందాలను విశిష్ట లక్షణాల ఆధారముగా కలుపుకుంటూ పోయే వారు దేవతలు, విడ గొడుతూ పోయే వారు రాక్షసులు.
హరప్పా మేహన్  జోడారో త్రవ్వకాలలో ఒక చోట  ౨౬ మానవ ఆస్థి పంజరాలు కనిపించినాయిట. అందులో ఒకడు మెట్లనుంది దిగుతూ, మరొకరు పైకెక్కుతూ మరనిన్చునట్లు నిర్ధారించుకొన్నారు. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడి యున్న మానవ కంకాళాలను చూచి, అనాగారికులయిన ఆర్యులు నాగరికులకు చెందినా హరప్పా , మేహెన్ జోదారో  నగరాలను ధ్వంసము చేసినారని  వీలర్, ఫిగేట్ లు నిర్ణయానికి వచ్చేసినారు. ఈ నగరాలు శంబరులవని, వీటిని ఆర్యులు నాశనము చేసినారని ఫిగేట్ చెప్పినాడు. కానీ శంబరులు పర్వత వాసులని ఋగ్వేదం చెబుతుంది. ఈ విషయము ఫిగేట్ గుర్తించ లేదేమో?
నదులు కాల గమనములో వరదలు వచ్చుట పరివాహ మార్గమును మార్చుకొనుట అందరికి తెలిసిన విషయమే. ఈ నగరాలు సింధూ నదికి తీవ్రమయిన వరదలు వచ్చినపుడు  నాశనము చేయ బడి యుండ వచ్చునన్న విషయము వారికి తెలియదా? కానీ వారి లక్ష్యము వేరే కదా.
   ఇటీవల అరేబియా సముద్రములో సాధించగా దొరికిన ద్వారక నగరమునకు సంబంధించిన  రాతి చెక్కడాలకు హరప్పా, మేహన్ జోదారో, లోతల్  లో దొరికిన చెక్కడాలకు పోలికలు కన్పించినవి. అవి ఒకే నాగరికతకు సంబంధించినవన్న భావనను కల్గించినవి. ఆ సిద్ధాంతమును విశ్వసించే వారిలో ఏ విధమైన మార్పు వచ్చినట్లు కనిపించదు.
ఇంకా ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చిన వారయితే అక్కడ ఆ పరంపర చిహ్నాలేవీ లేవేమి? ఎవరికైనా వారు తమ వెంట నిలుపుకున్న వారసత్వము వారిదే అవుతుంది. వారు అది ఎప్పుడో ఎవరి దగ్గిరనుండో సంపాదించారన్న సిద్ధాంతానికి విలువ లేదు. వేదాలలో సరస్వతి, సింధూ నదుల ప్రస్తావన తప్ప మధ్య ప్రాంతములో ఏ ప్రదేశము యొక్క ప్రస్తావన లేదన్న విషయాన్ని గుర్తించాలి.
ఆర్యుల ప్రధాన భాష సంస్కృతము. సంస్కృతమే గాక ప్రాకృత భాషలు కూడా వాడుకలో ఉన్నట్లు రామాయణము చదివిన వారికి తెలుస్తుంది. ప్రపంచములో ప్రధాన యూరప్ ఖండ భాషలన్నిటికి మాతృకలుగా చెప్ప బడుతున్న గ్రీకు, లాటిన్ భాష పదాలతో సంస్కృతముకు ఉన్న నిర్దుష్టమయిన  సంబంధమును చూచి విదేశీ భాష కోవిదులు నివ్వెర  పోయినారు. తర తరాలుగా మార్పు చెందని సంస్కృత వ్యాకరణము వారిని ఆశ్చర్య పరచినది. అయినా భారత దేశము నిలుపుకున్న సంస్కృతమును యూరోపియన్ భాషల మాతృకగా అంగీకరించ లేక  సంస్కృత భాషకు యూరోపియన్ భాషలకు ఒకే మాతృక ఉన్నాడని ప్రతిపాదించినారు. ఈ విధముగా ఒకే బృందము  మధ్య ఆసియా నుండి  బయలు దేరి వేర్వేరు శాఖలుగా చీలి అందులో ఒక శాఖ భారత దేశమునకు వచ్చినదని ప్రతిపాదించినారు. అయినా అందులో ఏకాభిప్రాయము లేదన్న విషయాన్ని క్రింది వ్యాఖ్యలు సూచిస్తాయి.
“ఎక్కడయితే సంస్కృతము, జెండ్ (పార్సీ) భాషలు మాట్లాడుతారో అక్కడే ఆర్యుల జన్మ స్థానముంది. లేదా ఉండ వచ్చును”అన్నారు హౌఫర్
“జెండ్, గ్రీక్, లాటిన్, గోతిక్ భాషలన్నియు వేర్వేరు కాలములలో సంస్కృతమునుండి జన్మించి ఉంటాయి” అన్నారు కర్జన్.
“మనము ఒప్పుకున్నా , ఒప్పుకొనక పోయినా , అతి ప్రాచీన భాషగా సంస్కృతమును చూడ వలసి యున్నది.” అన్నారు బీం అనబడు చరిత్ర కారుడు.
“యూరప్ లోని అనేక జాతుల మూలమునకు తిరుగు లేని ఋజువు సంస్కృతమే అవుతుంది” అన్నారు లూయీస్ జకోలియాట్.



.