గ్రీకుల ప్రాచీన చరిత్ర
అతి ప్రాచీనమయిన యూరోపియన్ సాంస్కృతిక వ్యవస్థ గ్రీకులకే
చెందుతుంది. ఈజిప్టు దేశపు ఔన్నత్యపు ఆఖరి దశలో
సుమారుగా క్రీ పూ ౧౧ వ శతాబ్దములో గ్రీకుల నాగరికత మొదలయింది.ఇక క్రీ శ ౪ వ
శతాబ్దము వరకు బ్రిటిష్ వారికి చరిత్రే లేదు. ౧౧ వ శతాబ్దము వరకు ఉన్న చరిత్ర కూడా నామ
మాత్రమె. మనకు తెలిసిన విస్తారమయిన బ్రిటిష్ చరిత్ర
నార్మనుల దండ యాత్రనుంది మాత్రమె. పెక్కు
యూరప్ దేశాలలో మానవుడు ఆదిమ మానవుడిలా బ్రతుకు తున్నాడు. రోమన్ నాగరికత ఇంకా
తలెత్త లేదు. ఈజిప్టు చాలా ఉన్నత స్థితిలో ఉన్నది. అటువంటి
దశ లో గ్రీకు నాగరికత యొక్క శైశవ దశ మొదలయినది.
మధ్యధరా సముద్రము లోని క్రీత్స్/కృతి ద్వీపము నుండి టర్కీ తీరము వరకు గ్రీకు
సామ్రాజ్యము వ్యాపించినది. ఎథెన్స్ (అధీన) నగరము కళలకు కేంద్రమై విలసిల్లినది. హఠాత్తుగా
తలెత్తిన ఈ నాగరికతకు ప్రేరేపణ ఏమిటి? వారి సంస్కృతి ఎటువంటిది?
ఎన్ సైక్లో పేడియా బ్రిటానికా లో ఇలా
ఉంది.”యూదుల వలే వారు కూడా తాము తిరిగి వెళ్ళుటకు
ఉవ్విళ్ళూరే మాతృ దేశమును హృదయాంతరాళాలలో దాచి యుంచినారు. ఆ మాతృ భూమిని
గురించి వారెన్నో గీతాలు ఆలాపిస్తూ ఉంటారు.”
ఆ పుస్తకములో ఇంకా ఇలా ఉన్నది. “దొరియన్లు
క్రీ పూ ౧౧ వ శతాబ్దములో దాడి చేసినారు. గ్రీకుల
కళా కౌశలములు వెల్లి విరిసినది ఈ దాడుల తరువాతనే. సుమారుగా క్రీ పూ ౯౦౦
సంవత్సరములో గ్రీకు ప్రపంచములో ఎథెన్స్ ఒక సాంస్కృతిక కేంద్రముగా విలసిల్లినది.
స్వర్ణము, స్వర్ణ కారులు తక్కువగనే
ఉన్నారు. తూర్పు దేశాలనుండి వచ్చిన స్వర్ణ కారులు
అట్టికా లో ఉన్నారు. ప్రాంతీయ స్వర్ణ కారులు కొద్ది మంది మాత్రమె. లెవ్
కాండి దగ్గిర, చాల్సిస్ ఎరిట్రియల మధ్య
లెలాంటిన్ మైదానాలలో లోహపు పరిశ్రమకు సమీప
ప్రాచ్య దేశాలతో వ్యాపారమునకు చక్కని రుజువులు కనిపించినవి. ఆ నగరములు క్రీ పూ ౭౦౦
లో పూర్తిగా ధ్వంసము చేయ బడినవి.”
పై సమాచారమును అనుసరించి వేరే
సంస్కృతిని అనుసరించు వారు దాడులు చేసిన
తరువాత మాత్రమె గ్రీకుల చరిత్ర మహోన్నత
వైభవ స్థితిని అందుకొన్నదని తెలుస్తున్నది. ఈ దాడులు చేసిందెవరు? ఆక్సస్స్ నదీ
తీరమునుండి వచ్చిన ఆర్యులా? యూరప్ లోని దేశ ద్రిమ్మరులా?
ప్రాచీన గ్రీకు చరిత్ర అంటే ప్రాచీన భారత
దేశ చరిత్ర అంటారు పోకాక్ మహాశయులు
తన India in Greece అనే పుస్తకములో. ఈ మాట అందరికీ ఆశ్చర్యము
కలిగించ వచ్చును. కానీ నిజము తెలియాలంటే
ఆయన చెప్పిన మాటలు కూడా పూర్తిగా వినాలి.
“ఆమె(గ్రీకు దేశము) తన భాష మాత్రమె కాదు.
తన వేదాంతము, తన ధర్మమూ, తన నదులు, తన పర్వతాలు, తన తెగలు, తన ఆలోచనలలో మార్పులు,
తన రాజకీయ జీవితమూ.... ఎలాంటి సంశయము లేకుండా తను భారత దేశము యొక్క పరిపాలనలో ఉన్న
విషయాన్ని గుర్తు చేస్తాయి.
పశ్చిమ భారత దేశములో మాయమయిన ప్రతి వంశ
వృక్షము గ్రీసులో ప్రత్యక్షమయినది. గ్రీకుల
భౌగోళిక స్థితుల గురించి వ్రాసిన Strabo అబంటిస్ అనే పేరును గురించి వివరిస్తూ
వారు ఫోశియన్ నగరములో స్థిర బడి
“అబే”నగరమును నిర్మించినారని,
తరువాత యుబోకా కు తరలి వెల్లినారని, అందు
వలన అబంటేస్ గా పిలువ బడినారని వ్రాసినారు. కానీ “అబే” పదము యొక్క వ్యుత్పత్తిని
తెలుప లేక పోయినారు. అయినప్పటికీ ఈ తెగలు ధైర్య, స్థైర్య వంతులయిన వీరులుగా ట్రాయి నగర్ మైదానాలలో పేరు గాంచినారు.
( హోమర్ ఇల్లియాద్ లో వారి ధైర్య
సాహసాలను, నిజాయితీని గురించి ప్రస్తావించినారు)
వారి అసలు జన్మ స్థానమును గురించి
న్యాయము జరుగ వలసి యున్నది. రాజస్థాన్ రాజ వంశావళి (బార్డ్స్)ను చరిత్ర కాదని
నిర్ణయించి చరిత్ర కారులు ఈ ప్రాచీన తెగ యొక్క వంశ వృక్షమును తెలుసుకొనే అవకాశము
లేకుండా చేసినారు. అబంటీస్ మాళ్వుల యొక్క అవంతికి చెందిన రాజ పుత్ర తెగకు చెందిన
వారు. “
పోకాక్ ఇంకా ఇలా న్నారు.”క్రీ పూ ౭౦౦ కు
చెందిన గ్రీకు పలాస్గాన్ మహా రాజు
పాలిస్తాన్ రాజ కుమారుడు. పాలిస్తాన్ అంటే పాలీ దేశము లేదా మగధ.”
“అతి ప్రముఖముగా చెప్ప బడిన ట్రోజన్
(ట్రాయి) నగరపు గోడలు పలాస్గయన్ల చేత లేదా సైక్లోపుల చేత నిర్మించ బడినవి. ఆ
గోడలను నిర్మించిన కాలానికి హోమర్ పుట్ట లేదు. ఆ కాలములో పలాస(పాలి) గ్రీస్ లో
మాట్లాడ బడుతూ ఉండేది. సైక్లోపులు అనే పదము గోక్లోపులు అనే పదమునుండి వచ్చినది. ఈ
గోక్లోపుకు మూల పదము గోకుల ప్రముఖ్. వారు యమునా నదీ తెరమున గోకుల దేశములో
నివసించిన ప్రముఖులు. ఇది కృష్ణుడు బాల్యములో గడిపిన ప్రదేశము.”
పై మాటలను భారతీయులెవరూ చెప్పా లేదు.
ఇంకా గ్రీసు లో మొదట స్థిర పడిన వారిని ఎజియన్లని లేదా డానా లు అని పిలిచే వారు.
వీరు దనువు వంశ పరంపరలో వచ్చిన వారు. వీరు దానవులని పిలువ బడే వారు. వారి ప్రత్యేక
సంస్కృతి కూడా ఇల్లియద్ లో కాన బడుతుంది.
హెలెన్ అతి లోక సౌందర్యవతి. ఆమె భర్త
అయిన మేనేలాస్ కు అతిథి గా వచ్చిన పారిస్ రాకుమారుడి వ్యామోహములో పడుతుంది. ఈ
విషయములో పారిస్ ఎటువంటి వ్యతిరేకతను వ్యక్తము చేయ లేదు. ఇద్దరూ రహస్యముగా ఎజియన్
సముద్రము దాటి ట్రాయి నగరమును చేరుకున్నారు.
గ్ర్రేస్ ఒక దేశముగా కనిపించదు. అందులో
ఉన్న చిన్న చిన్న పాలకులు ఒకటయినారు. వారి నాయకుడు ఆగమేమ్నన్. వారిలో ఆకిలీజ్ మహా
వీరుడు. ఈ సైన్య బృందము తన యుద్ధ యాత్రలో దారిలో ఉన్న గ్రామాలను కొల్ల గోడుతారు.
అందమయిన అమ్మాయిలను చెర బడుతారు. చివరకు ఇద్దరు అమ్మాయిల విషయములో ఆగమేమ్నాన్ ఆకిలీజ్ ల మధ్య ద్వేషము ఏర్పడి, ఆకిలీజ్ యుద్ధ
రంగమునుండి వెలుపలికి వచ్చేస్తాడు. ఇందులో మనము నీతి/నియమములు లేని ఒక ఆదిమ జాతిని
, వారు చేసే ఆకృత్యాలను చూస్తాము.
ఇక ట్రాయి నగర పాలకుడు ప్రయాం. అతడి పెద్ద కుమారుడు హెక్టార్. హెక్టార్ తన
తమ్ముడు పారిస్ చేసిన పనిని నిరసిస్తాడు. కానీ వీలు లేని పరిస్థితులలో రాజ్య రక్షణ భాధ్యతలో ఉంది పోతాడు. హోమర్ రచనను
అనుసరించి ట్రాయి నగరములో రాజ వంశీకుల మీద నగరములో అపరిమితమయిన గౌరవము
కనిపిస్తుంది. చక్కని వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇక హెలెన్ చాంచల్యానికి ప్రతీక. హోమర్ ద్వారా రాజకుటుంబమును
గురించి తెలుసుకున్న ప్రతియొక్కరికి రాజ
కుటుంబము మీద ఏర్పడిన గౌరవము ఎజియన్ల/గ్రీకుల మీద ఏర్పడదు. చని పోయిన రాజ
కుటుంబీకులకు, ముఖ్యముగా హెక్టార్ కు దహన సంస్కారము చేయుటకు రాజ కుటుంబీకులు పడిన
తపన ఒక్క సారి భారత సంస్కృతిని గుర్తుకు తెస్తుంది. హెక్టార్ మహా వీరుడు. ఏనాడూ
యుద్ధ రంగములో వెనుకకు తిరుగ లేదు. అతని ధాటికి తట్టుకోలేని శత్రు సైన్యము చేత
మోసము చేత చంప బడినాడు. బహుశా పోకాక్ హెక్టార్ లో ఒక మాళ్వ రస పుత్రా వీరుడిని
చూచినాడేమో?
ఎజియన్ /గ్రీకు వీరులు వేర్వేరు ప్రాంతాల
వారయినప్పటికి వారి ప్రధాన ఉద్దేశ్యము ట్రాయి నగర విధ్వంసమే. బాగా ప్రగతి సాధించిన
ట్రోజన్ నగరము గ్రీకుల ఆధీనము లోనికి వచ్చినది. తరువాతి కాలములో వారి ప్రభావమే
గ్రీకుల నాగరికతకు మెరుగులు పెట్టినది. ఇటువంటి జాతి మాత్రమె తమ పవిత్ర భూమికి
తిరిగి వెళ్లాలని జానపద గీతాలు పాడుతున్నదేమో? నిజాయితీ గలిగిన చరిత్ర కారులు నిజాన్ని తెలుసుకోవాలి.
This closes the series on our history