Monday, December 19, 2016

మన చరిత్ర3

                                                    
         
                                           కొత్త కథ  మొదలయింది
అలెక్జాండర్ మన  దేశము మీద దండెత్తి వచ్చినపుడు అటు తరువాత కొందరు గ్రీకు చరిత్ర కారులు మన దేశమును  సందర్శించినారు.  వారిలో మెగస్తనీస్, అర్రియన్  అను వారు ప్రముఖులు. అలెగ్జాండర్ మరణము తరువాత  సెల్యూకస్ యొక్క రాయబారిగా  మెగస్తనీస్ మన దేశములో చాలా కాలము ఉన్నాడు. వీరు వ్రాసిన అనుభవాల సంపుటములు చాలా వరకు శిథిలము అయినాయి.  శిథిలము కాని భాగాలను తిరిగి సంకలనము చేసి ప్రకటించినారు. ఈ సంకలములనే బ్రిటిష్ చరిత్ర కారులు ఉపయోగించుకున్నారు.
మెగస్తనీస్ వ్రాతలను అనుసరించి  ఆయన కాలములో భారత దేశ పరిపాలనలో  (అంటే  అప్పుడు మగధను పరిపాలించిన వారిలో) పరంపరగా ముగ్గురు వ్యక్తులను పేర్కొన్నారు. అది గ్రీకు వారికి అనువయిన ఉచ్చారణలో Xandrames, Sandrocottus, Sandrocyptus . అందులో మొదటి వ్యక్తిని నవ నందులలో ఒకరిగా , వారిని చంపి అధికారము చేపట్టిన మౌర్య చంద్ర గుప్తుని రెండవ వానిగా, ఆయన కొడుకు అయిన బింబి సారుడిని మూడవ వానిగా  జోన్స్ తిరుగు లేని నిర్ణయము తీసేసుకున్నాడు. ఈ విధముగా భారత దేశ చరిత్రను సుమారుగా ౧౨౦౦ సంవత్సరాలు ఆధునిక కాలము లోనికి లాగినాడు. ఇక పురాణాలలో ఉన్న పాత్రలను ఏమి చేయాలో వారి మధ్య కాలాన్ని ఎలా కుదించాలో ఆయనకే చేతనవుతుంది. చివరకు మన చరిత్రను వేరే వారు నిర్ణయించే దుస్థితి ఏర్పడింది.
భారతీయ మూల గ్రంథాలను చదివి వాటికి వ్యాఖ్యలను వ్రాసే భాద్యత మరో ప్రముఖ వ్యక్తికి ఈయ బడినది. భారత దేశానికి కీడు చేయాలని వచ్చినా భగవంతుడి ప్రణాళికను అనుసరించి ఆయన ద్వారా మేలే జరిగింది.  వేదాలను నిర్వీర్యము చేయాలనుకున్న ఆయన ప్రయత్నములో వేదములు అనే గ్రంథాలు ఉన్నాయని ప్రపంచమంతా తెలిసి,  వారు కూడా వేదాధ్యయనము చేయుట మొదలు పెట్టినారు. అయితే ఆయన తన భార్యకు వ్రాసుకున్నారు.” వేదముల అనువాదము భారత దేశపు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భారతీయుల అంతరాత్మను మేలుకొలుపుతుంది.  వేడాలంటే భారతీయుల ఆత్మలు. గత మూడు వేల సంవత్సరాలు ఏ వేదాలయితే భారతీయులను నడిపించిందో అవి (ఈ అనువాదాల వలన ) వారి హృదయ ఫలకాలనుంది చెరిపి వెయ బడుతాయి.” అది ఆయనకు కలగానే మిగిలి పోయింది. ఆ ప్రముఖ వ్యక్తీ పేరు  మాక్స్ ముల్లర్. ఆయన కూడా జోన్స్ పైన చేసిన ప్రతిపాదనను బల పరచడమే కాదు. అది భారత  చరిత్ర నిర్మాణమునకు  sheet-anchor  లేదా చుక్కాని లాంటిదని మెచ్చుకున్నాడు. ఈ నిర్ణయానికి అంగీకరించని విదేశీ చరిత్ర కారులను ఎవరూ పట్టించుకోలేదు.
ఈ విదేశీ చరిత్ర కారులలో  M.Troyer  ట్రాయర్ ప్రముఖుడు. ఆయన కాశ్మీర రాజ తరంగిణి మీద నిశితముగా పరిశోధన చేసినారు. ఏ విధముగా పరిశీలించిననూ  అలెగ్జాండర్ దండ యాత్ర కాలమున మగధ పాలకుడు మౌర్య చంద్ర గుప్తుడు కాజాలడని ఆయన ఎన్నో సార్లు మాక్స్ ముల్లెర్ కు వ్రాసినాడు. జవాబు రాలేదు. ఒకానొక సమావేశములో తటస్థపడినపుడు ట్రాయర్ తో  మాక్ష్ ముల్లర్ ఇలా అన్నాడు,”ఈ విషయము ఎప్పుడో నిర్ణయము చేయ బడినది. ఇంక తిరిగి చర్చించ వలసిన అవసరము లేదు.”
ఇంక విషయాన్ని మన కోణములో పరిశీలించ వలసి యున్నది.  మహా భారత యుద్ధమునకు పూర్వ కాలము నుండి, మగధకు గిరివ్రజము(నేటి  గిర్నార్) రాజధాని. అదే మౌర్య చంద్ర గుప్తుడి రాజధాని అయినది. కానీ గుప్త  రాజులు ఒక నాటి కుసుమ పురము అనే  మరో  పేరుతొ  ఉన్న  పాటలీ పుత్రమును రాజ దాని గా పాలించినారు. గుప్త వంశీకులు సూర్య వంశ క్షత్రియులు. అందుకని అయోధ్యలో పట్టాభిషేకము చేసుకున్నారు.  పాలింబోత్రా గా  మెగస్థనీస్ చెప్పిన రాజధాని పాటలీపుత్రము అవుతుంది కానీ ఎట్టి  పరిస్థితుల్లో మౌర్య చంద్ర గుప్తుడు యొక్క రాజ దాని అయిన గిర్నార్/గిరివ్రజము కాలేదు. మగధను పాలించిన ఆంధ్రుల ఆఖరి రాజు అయిన చంద్ర శ్రీ శాతకర్ణి పసి బాలుడు. ఈ పేరుకు మెగస్టనీస్ చేత చెప్ప బడిన  గ్జామ్ద్రేమ్స్ లేదా  Xandrames కు  శబ్దములో పోలిక ఉన్నది. చంద్ర శ్రీ ని వధించి అతడి సేనాని అయిన గుప్త చంద్ర గుప్తుడు పాటలీ పుత్రపు రాజు గా పట్టాభిషేకము  చేసుకున్నాడు. ఈయననే గ్రీకు రాయబారి సాంద్రోకొట్టాస్ (Sandrocottus) గా చెప్పినారు. ఇక  ఈయన కుమారుడు అయిన సముద్ర గుప్తుడు సాన్డ్రోసిప్టస్ (Sandrocyptus) అవుతాడు. ఇదే మౌర్య సామ్రాజ్య విషయముగా భావిస్తే నవ నందులలో ఎవరి పేరు Xandrames తో సరిపోతుందో తెలియదు. ఇంకా చంద్ర గుప్తుడిని మధ్య వాడిగా తీసుకున్నా అశోకుడి పేరు సాన్డ్రోసిప్తస్ తో  ఏవిధముగానూ సరిపోదు.
వారి సిద్ధాంతము ప్రకారము మౌర్య చంద్ర గుపుడు పాలకుడయితే ఆయన జీవితములో ప్రధాన పాత్ర వహించిన చాణక్యుడి పేరు ఎక్కడైనా ప్రస్తావన రావలసి యున్నది. కాని అది జరుగ లేదు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయము. అంతే  గాక చాణక్యుడు అర్థ శాస్త్రములో వివరించిన నగర పరిపాలనా విదానముకు మెగస్తనీస్ వర్ణించిన నగర పరిపాలనా విదానముకు ఎక్కడా సంబంధము లేదు. ఆరు లక్షల సైన్యముతో దేశమంతనూ తన ఆధీనము లోనికి తెచ్చుకున్నాడన్న వ్యక్తీ ఏ మాత్రమూ మౌర్య చంద్ర గుప్తుడు కాదు. మౌర్య సామ్రాజ్యము దక్షిణాపథమునకు విస్తరించింది చంద్ర గుప్తుడి మనుమడు  అశోకుడు చేసిన కళింగ యుద్ధము తరువాతనే. కాని, సముద్ర గుప్తుడు దేశమంతా దిగ్విజయ యాత్ర చేసి, నావికా బలమును పెంచుకొని, విదేశీ వాణిజ్యము కూడా చేసినట్లు చెబుతారు. ఈ విజయ యాత్ర లో భాగముగానే వాయవ్య భాగములో నొక విదేశీ  రాకుమార్తె (సెల్యూకస్ కుమార్తె హెలీనా) ను వివాహ మాడినట్లు అలహాబాద్ శిలా శాసనములో ఉన్నది. కొద్ది మంది చేసిన వికృత కల్పనలు తప్ప మౌర్య చంద్ర గుప్తుడు ఏ విదేశీ రాకుమార్తె ను వివాహము ఆడినట్లు ఋజువులు లేవు.
మెగస్తనీస్ ఆ నాటి మగధ రాజులందరికి పేరు వెనుక వంశపు పేరు ఉండేదని, వారు సూర్య వంశ క్షత్రియులని వ్రాసినాడు. అందరి యొక్క పేరులో సూర్య వంశమును సూచిస్తూ ఆదిత్య పేరు ఉండేది. ఉదాహరణకు మొదటి చంద్ర గుప్తుడు, సముద్ర గుప్తుడు, రెండవ చంద్ర గుప్తుడుల యొక్క అధికారిక నామములు వరుసగా  విజయాదిత్య,  అశోకాదిత్య మరియు విక్రమాదిత్యులు. సూర్య వంశ క్షత్రియులకు ఆదిత్య శబ్దము ఎటువంటి అసంబద్ధతను సూచించదు. కానీ మౌర్య వంశీయులకు ఇటువంటి సాంప్రదాయము లేదు.
అర్థము కాని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. చరిత్ర నిర్మాణము ఎలా జరిగిందని ప్రశ్నిస్తే వారినుండి సరి అయిన జవాబు ఉండదు. బైబిల్ లీ ఇండీ లో లూయీస్  జకోలియట్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుందాము. “రెవరెండ్ ఫాదిరీలు, జెసూట్లు, ఫ్రాన్సిస్కన్లు మరియు ఇతర సంస్థలు ఒకే లక్ష్యముతో పుస్తకముల దహన కాండను చేసినారు. చదువుకున్న వారే గాక ప్రాచ్య పరిశోధకులు కూడా ఈ విషయాన్ని ఖండించుట ఎంతో అవశ్యము. ప్రతి యొక్క వ్రాత ప్రతి, ప్రతి సంస్కృత గ్రంధము వారి చేతులలో పడుటే తరువాయి,  నాశనము చేయ బడి, దగ్ధము  చేయ బడినది. ప్రాచీన  గ్రంధమయితే సరి, దేనిలో విషయాలు  వేరొకరి చేత ప్రశ్నింప బడుటకు వీలు లేకుండా ఉంటాయో అట్టి గ్రంధములు ప్రముఖముగా తగుల పెట్ట బడినవి.”

ఈ విషయము పై జస్టిస్ తిలాంగ్ వాక్యములు ఇలాగున్నవి.” ముందు నిర్ణయించుకొని చేసిన ఇటువంటి ప్రకటనలు భారత దేశపు ప్రాచీనతకు ఏంతో హాని చేస్తున్నవి. చిల్లింగ్వర్త్ పరిభాషలో “వారాశించే దానిని గూర్చి  కలలు గంటారు.ఆ కలలే నిజమని నమ్ముతారు.””
Also visit  trilimga.blogspot.in
give your comments.