నన్ను వర్తమానములో నడిపిస్తున్న
మహాత్ములకు, భవిష్యత్తులో నడిపించే
మహాత్ములకు ప్రణామములు.
పల్లెటూరిలో పుట్టి, ప్రకృతి రసాస్వాదన చేస్తూ
కొత్త కొత్త మార్పులలో ప్రవేశిస్తూ, దీనిని వ్రాయుటను మొదలు పెట్టినాను. ఈ నాడు ప్రతి యొక్కరు నేను/మీరు/ఎందరో చెపుతున్నారు, లోకమంతా పాడయి పోయిందని, ప్రతి యొక్కరి
లో స్వార్థము పెరిగి పోయిందని. ఈ చెప్పడముతో తమ భాద్యత తీరి పోయిందని అందరూ పక్కకు
తప్పుకుంటున్నారు.
గౌతమ
బుద్ధుడిని కొంత మంది ప్రశ్నించినారు, ”మరణానంతర జీవితముండా?” అని. ”ఈ జీవితమును
పట్టించు కొనండి” అని ఆయన జవాబు ఇచ్చినారు. మిగిలిన విషయాలు ఇప్పుడు అనవసరము అని
ఆయన ఉద్దేశ్యము. వారు వెంటనే వ్రాసుకున్నారు,” బుద్ధుడి ప్రకారము మరణానంతర జీవితము
లేదు.” అని. కొన్ని పాఠ్య పుస్తకాలలో ఇవే పాఠాలు చెపుతున్నారు. ఇక బుద్ధుడు చెప్పిన జాతక కథలు పునర్జన్మను గూర్చి
చెబుతూనే ఉన్నా వారికి వినిపించవు. లలిత విస్తారము అన బడే బౌద్ధ మత గ్రంథము లో
బుద్ధుడు తన గత జన్మ గురించి చెబుతాడు. టిబెట్ లో బౌద్ధ మత గురువులు అయిన లామాలు
తమ గత జన్మలు, పునర్జన్మలను గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. కాని మన దార్శనికులు
బౌద్ధము తిరిగి జన్మను నమ్మదని ఘంటా పథముగా చెప్పి వేస్తుంటారు.
గురువులు పూర్వ కాలము శిష్యులకు ఎంత
అవసరమో అంత వరకే బోధించే వారు. కానీ ఈ నాడు శిష్యులు “గురువు గారూ! మీరు చెప్ప
గలిగినంత చెప్పండి. అందులో మేము ఏరుకొన కలిగిన విషయాలను ఏరుకుంటాము” అంటున్నారు.
వీరే నిజమయిన గురువును మించిన శిష్యులు. ఇందులో మరొక ఉప శాఖ ఉన్నది. “గురువు గారూ!
అన్నీ చెప్పి ఉపయోగము లేదండి. మాకు మీరు పెట్ట బోయే
పరీక్షకు ఎంత అవసరమో అంతే చెప్పండి” అనే మేధావులు కూడా తయారు అయినారు. ఇంకా
గురువులకే పరీక్ష పెట్టె మరో శాఖ ఒకటి తయారు అయింది. ఏమయినా కాస్త తెలివి తేటలకు
పరీక్ష పెట్టె ప్రశ్న పరీక్షలో వస్తే ఇది అసలు పాఠ్య ప్రణాళిక లోనే లేదు. అందుకని
ఆ ప్రశ్నను ఉంచకండి లేదా దానికి ఊరకే
మార్కులు ఇచ్చి వేయండి అని చెప్పే విద్యారంగానికి సంబంధించని బడుద్ధాయిలు తయారు అయినారు. ఇంక సరి అయిన విద్య
ఎక్కడనుండి వస్తుంది? చివరకు శిష్యులకు ఏమి చెప్పాలో తెలియని గురువు, తనకు నచ్చిన
పాఠాలే చెప్పాలనే శిష్యులు తయారవుతున్నారు. వీళ్ళందరికీ తెలియని విషయము గణితము లో
మహా మేధావి అయిన రామానుజం ఇంటర్ లో
ఉత్తీర్ణుడు కాలేదని, మనము వాడుతున్న ఆల్టర్నేట్ కరెంట్ ను ప్రవేశ పెట్టిన టెస్లా
ఇంజనీరింగ్ రెండవ సంవత్సరము మించి చదువ లేదని.
విద్యా
విధానమని అనగానే మనకు శీలము గుర్తుకు వస్తుంది. విద్య ఒసగును వినయంబు అనేది మన సూక్తులలో ఉన్నది. ఇప్పుడు మనకు వచ్చే
సాధారణ మయిన ప్రశ్న ఒకటే. శీలము విద్య లో భాగమా కాదా? అలా కాక పొతే పైన సూక్తులకు విలువ ఉన్నదా?
ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మన పద
జాలానికి అర్థమే మారి పోయింది.
ఈ క్రింది సంఘటన కొన్ని సంవత్సరాల
క్రిందట జరిగింది. ఒక రోజు గ్రంథాలయములో కూర్చొని వార్తా పత్రిక చదువుతున్నాను.
ఎదురుగా ఇరువురి మధ్య ఎదో తీవ్రమయిన చర్చ జరుగుతున్నాది. కంఠముల తీక్ష్ణత బాగా పెరిగింది. అంతా
వింటున్నాను. ఒక రచయిత్రి గురించి చాలా తీవ్రముగా చర్చ జరుగుతున్నది. వ్యక్తిగత శీలమును
వదిలి వేసిన వ్యక్తీ ఎన్ని నీతులు చెప్పినా సమాజానికి ఒరిగేదేమిటి? ఇది మొదటి వాడి
ప్రశ్న.
వ్యక్తిగత విషయములతో మనకు సంబంధము లేదు. సమాజానికి
ఆమె చేసిన అద్భుతము అయిన రచనలను మాత్రమే మనము తీసుకోవాలి అంటాడు మరొక వ్యక్తీ.
ఇరువురు జుట్టు పట్టుకొనే స్థితి వస్తే అందరూ వారికి సర్ది చెప్పి బయటకు
పంపించినారు. ఈ సందర్భములో నాకు కొన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి.
చిన్నప్పుడు (నా ఏడవ తరగతిలో ) ఒక సైన్స్
మాస్టర్ అద్భుతముగా పాఠాలు చెప్పే వారు. పిల్లలు అసలు శబ్దము చేసే వారు కాదు ఆయన
క్లాసు లో. ఒక సారి అతడి వ్యక్తిగత జీవితములో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినవి.
అంతే. అప్పటి నుండి ఆయన ఎంత బాగా చెబుతున్నా, పిల్లలు పాఠాలు వినుట మాని, గొడవ
చేయుట మొదలు పెట్టినారు. ఇది ౧౯౬౪ నాటి మాట. ఎందుకలా జరిగింది?
మనము ఎన్ని నీతులు చెప్పినా విద్యార్థులు
జాగ్రత్తగా వింటారు. అంతే కాదు మన నడవడికను బాగుగా గమనిస్తూనే ఉంటారు. మనము
నియమాలను పాటించనప్పుడు వారు మనలను వినడము మాని వేస్తారు.
మరొక ఉదాహరణ “సారా జహాన్ సే అచ్చా” పాట వ్రాసి మనలను
మెప్పించిన ఇక్బాల్ మహాశయుడు పాకిస్తాన్ కు జారుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే కల్లు
తాగకురా అని పాట వ్రాసి ఆ పాట
గొప్పతనానికి సన్మానము చేయించుకొని చివరకు సంతోషము పట్ట లేక కల్లు పాకలో దూరినట్లు
ఉంటుంది. నిజముగా ఆ పాటలో ఉన్న ఉద్వేగము ఉంటే ఇలా చేసే వాడు కాదు. అందుకే కవిత్వము
వ్రాసినంత మాత్రాన అది వారిలో ఉన్నట్లు కాదు. వాళ్ళు మాటల గారడీ వాళ్ళు మాత్రమె.
బంకిం బాబు ‘వందే మాతరం” గీతాన్ని తన
ఆనంద మఠములో వ్రాసి దేశ ప్రేమికుల చేత పాడించినాడు. తను దేశ ప్రేమికుడిగా
జీవించినాడు. అందుకే వందే మాతరం యొక్క స్థాయి మొదటి గీతానికి రాదు. పై విషయాలను
గమనిస్తే మనకొక విషయము తెలుస్తుంది. శీలము లేని వాడు నటిస్తాడు, శీలమున్న వాడు
జీవిస్తాడు. మనకు కావలసినది నటనా? జీవనమా?
అయోధ్య
రాముడిని రోజూ తలచుకుంటారు కొంత మంది. మరికొందరు రాముడు అయోధ్యలోనే పుట్టలేదన్న
వారు ఉన్నారు. కాదు కేరళ లో ఉన్న అయోధ్యలో పుట్టినాడన్నారు, కాదు, కాదు, తాయిలాండ్
లో ఒక అయోధ్య ఉన్నది అక్కడే పుట్టినాడని అన్నారు ఇంకొకరు. ఇంకొక సరికొత్త
ప్రతిపాదన ఏమిటంటే గాంధార దేశములో కూడా
ఇంకో అయోధ్య ఉందిట. అక్కడయితే అసలు కట్ట
లేరు కదా అనుకోని ఉంటారు పిచ్చి వాళ్ళు. ఇవి అన్నీ వారు వోట్ల కోసము పడే పాట్లు. దురదృష్టమేమిటంటే
విజయ వాడలో కూడా ఒక అయోధ్య నగర్ అనే ప్రాంతముంది. అది వారి దృష్టికి ఎందుకు రాలేదా? అనిపించింది.
దుర్గమ్మ ప్రాంగణ మయిన విజయవాడకు అంత అర్హత లేదనుకున్నారేమో? ఆ సెక్యులరిస్టులు.
No comments:
Post a Comment