Tuesday, September 9, 2014

నాస్తికుడు ౧

                                                      

నీలకం మహా దేవుడి దేవాలయము ముందు కొంత మంది గుంపులుగాయున్నారు. వారి చేతుల్లో కొన్ని నినాదాలతో కూడిన అట్టలున్నాయి. రామ తీర్థము లో ఆ రోజు మూఢ నమ్మకాలు పైన ఒక సమావేశము జరిగినది. అన్ని రకాల మూఢ నమ్మకాలను ఖండించాలని తీర్మానము చేయ చేయ బడినది. అందులో  భాగముగా గుడిలో జరిగే ఉపన్యాసముల పైన కూడా నిరసించాలనుకున్నారు. అందులో స్వామి శివానంద ఇస్తున్న ఉపన్యాసాలను ఖండించినారు.
          దేవాలయ కమిటీ వారు వారిని లోపలి రాకుండా అడ్డము పడినారు. వారి మధ్య వాగ్వాదములు కొంచెము తార స్థాయికి అందుకున్నాయి. ఇది తెలుసుకున్న స్వామిజి స్వయముగా బయటికి వచ్చినారు. వారిని సగౌరవము గా తన విశ్రాంతి గదిలోనికి ఆహ్వానించినారు. ఆయన ఏ విధమయిన అసహనాన్ని కోపాన్ని ప్రదర్శించ లేదు. అందరినీ నవ్వుతూ లోపలి ఆహ్వానించినారు. అందరికీ త్రాగడానికి నీరు ఇప్పించినారు. అందరితో బాటు  తను కూడా నేల మీదనే కూర్చున్నారు. కొందరు పైన  కుర్చీపైన  కూర్చోమని చెబుతుంటే వారించినారు. ఆవేశము లోయున్న వారిని శాంత  పడుటకు కొంత సమయమును ఇచ్చినారు. తరువాత నెమ్మదిగా అడిగినారు.
“చెప్పండి, మీ సమస్య ఏమిటి?”
నలుగురు ఒక్క సారిగా మాట్లాడ బొయినారు. స్వామిజి  “అందరు మాట్లాడ వచ్చును. కానీ అందరూ ఒకే సారి అయితే ఎలా చెప్పండి. మీ సమస్య మీద అవగాహన యున్న వ్యక్తి ఎవరో అతడినే ముందు మాట్లాడ నిద్దాము. ఏమంటారు?”
ఒకరు చేయి ఎత్తినారు.
“మీ పేరేమిటి?”
“శేఖర్ “
“యితడు మాట్లాడుట మీకు ఇష్టమేనా?”
అందరూ తలలూపినారు.
“ఇంక చెప్పవయ్యా “
“మతము పేరుతొ , కులము పేరుతొ జనము ఉన్నాడో లేదో తెలియని దేవుడి కొరకు కొట్టుకొని చస్తున్నారు.ఈ  మూఢ నమ్మకాలకు వ్యతిరేకముగా మేము జనము లోనికి వెళుతున్నాము. అయితే మీరు చెప్పేవన్నీ మా ఆలోచనలకు వ్యతిరేకము గా ఉన్నాయి. అందుకే మీతో మాట్లాడుదామని వచ్చినాము.”
“ ఓస్, అంతేనా? ఆ పేరుతొ అన్నా మనము హాయిగా మాట్లాడు కోవచ్చును. చెప్పండి.”
“ఇంతకూ మీరున్నారని చెబుతున్న దేవుడు ఎక్కడున్నాడు?”
“మీలో, నాలో ,అందరిలో, అన్ని జీవ రాసులలో ఉండేది ఆయనే కదా.”
“అంటే, మీరు చెప్పేదేమిటి? మీ లెక్క ప్రకారము మేము కూడా దేవుళ్ళ మేనా?”
“ఔను ఖచ్చితముగా.”
“అంటే, మీలోను, మా లోను,ఒక్కడే దేవుడున్నారంటారా?”
“ఔను.”నవ్వుతూ స్వామిజి జవాబిచ్చినారు. అడుగుతున్న వాడికి పిచ్చి ఎక్కినట్లు అయినది.
“అయితే ,అందరిలో ఉండే ఈ దేవుడి కోసము గుళ్ళు, గోపురాలు  ఎందుకు చెప్పండి?”
స్వామిజి ఒక నిముషము ఆగినాడు. “ఇంతేనా ఇంకా ఏమయినా ప్రశ్నలున్నాయా?” అని అడిగినాడు.
“అందరిలో ఉండేది ఒకే దేవుడయితే ఇన్ని తెదాలేందుకు?” మరొకరు అడిగినారు.
“మంటకు, పొగ మధ్య నున్న నిప్పుకు తేడా తెలుసు కదా.”
“ఏమిటి?”
“ఏమీ లేదు మొదటిది నేరుగా మంటగా కనిపిస్తుంది. రెండవ దానిని దగ్గిరకు వెళ్లి పరిశీలిస్తే కాని మంట ఉనికి తెలియదు.”
ఎవరూ మాట్లాడ లేదు.
“మీలో ఆవేశము గా యున్న వారిలో మంట పైకి కనిపిస్తున్నాది. మిగిలిన  వారిలో అది అణిగియున్నది. ప్రశ్నలు వేసి వేధిస్తే తప్ప అది బయటకు రాదు. అంతేనా?”
“ఈ తేడాలు ఎందుకు వచ్చినాయి?”
“ఒక చోట ఒక పెళ్లి లేదా, ఉత్సవము జరుగుతున్నది.అక్కడికి ఒకడు మండు టెండలో ఓ అయిదు మైళ్ళు నడచి వచ్చినాడు. బాగా అలసి పోయినాడు. ఆకలి వేస్తున్నది.ఎపుడెపుడు భోజనాలు పెడతారా అని చూస్తున్నాడు. మరొక వ్యక్తి,  ఆ వూళ్ళో వాడే అప్పుడే భోజనానికి వచ్చినాడు. ఇద్దరి ప్రవర్తనలో తేడా ఉంటుందా ఉండదా చెప్పండి.” నవ్వుతూ అడిగినాడు.
వచ్చిన వాళ్లకు తెలుసు, మొదటి వాడికి, అలసట, ఆకలి వలన ఆవేశము, కోపము వస్తుందని.రెండవ వాడికి అటువంటి సమస్య లేదు.
“అదే సంస్కారమున్న వాడయితే, అయిదు మైళ్ళ నుండి ఎండలో వచ్చి , అలసి పోయినా ఒకే ప్రశాంతత తో యుంటాడు. మామూలు వ్యక్తి అయితే అసహనాన్ని ప్రదర్శిస్తాడు.”
ఎవరూ మాట్లాడ లేదు.
“ఇది వారు ఎదిగిన వాతావరణము, వారికున్న అనుభవాలనుండి వస్తుంది. ఎక్కువ ప్రయాణము  చేసిన వాడికి ఎక్కువ అనుభవాలు ఉంటాయి, ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు. అందు వలన వారి ప్రవర్తన కూడా ఆ స్థాయి లోనే యుంటుంది. వారి ప్రతి సమస్యకు ఆవేశము బయట పడకుండా పరిష్కారానికి ప్రయత్నమూ చేస్తారు. “
“అంటే మేము ఎదుగుదల లేని వారమని మీ ఉద్దేశ్యమా?”,ఒకరు కోపముగా ప్రశ్నించినాడు.
“ప్రతి దానికి మీరే తీర్పు చెప్పుకోకూడదు. కానీ, ఏ విషయము నేర్చుకోవాలన్నా రెండు లక్షణాలు ఖచ్చితముగా యుండాలి. ఒకటి శ్రద్ధ. రెండవది ఓర్పు. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ముందుకు వెల్ల లేరు. మీకు రెండు కథలు చెబుతాను. వినే ఓపిక ఉందా?”
కథ అనేటప్పటికి అందరికి ఆసక్తి పెరిగింది. కానీ తాము అడిగిన ప్రశ్నకు జవాబు ఈయకుండా దాట వేస్తారేమోనన్న అనుమానము కూడా పెరిగినది.అయినా ఆయన చెప్పే విషయము వినడానికి సిద్ధ పడినారు.
“చెప్పండి”, అన్నారు అందరూ ఒక్క సారి.
“అయితే కొంత మందికి అనుమానాలున్నాయి. అనుమానాలతో అన్నీ పూర్తిగా అర్థము చేసుకోలేరు. సరే ముందు ఒక పని చేద్దాము. చిన్న ప్రయోగము. అందరూ కళ్ళు మూసుకోండి.”
అప్పటికే ఆయన మాటల ప్రభావములో నున్న వారు ఎందుకని అడుగ లేదు.
స్వామీజీ తిరిగి అన్నారు. “ఇందులో ఏ మాయా మర్మము లేదు. ఏ మెస్మరిజం లేదా హిప్నాటిజం లేవు. కళ్ళు మూసుకొని జాగ్రత్తగా ఇక్కడ నేను ఏమి చెప్పినానో గుర్తు తెచ్చుకోండి. తరువాత నెమ్మదిగా ఇక్కడికి వచ్చే ముందు ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆ దృశ్యము మీ కాళ్ళ ముందు కనిపించాలి. తరువాత ఆ ముందు జరిగిన సంఘటన  ఆ దృశ్యము,  తరువాత ఆ ముందు జరిగిన సంఘటన  ఆ దృశ్యము,  తరువాత ఆ ముందు జరిగిన సంఘటన  ఆ దృశ్యము ...........ఇలా ఒక దాని వెంబడి ఒకటి మీ కళ్ళ ముంది జరిగిన పధ్ధతికి వ్యతిరేక మయిన దిశ లో మీ కళ్ళ ముందు కనిపించాలి. ఇలా మీరు నిద్ర లేచిన సమయము వరకు వెళ్ళండి.”
ఆయన చెప్పిన పద్ధతికి వాళ్లకు ఒక రకమయిన మత్తు వచ్చేసినది. ఒకరో ఇద్దరో తప్ప అందరూ ఆ ప్రభావములో యున్నారు. ఇలా ఒక పావు గంట గడిచింది.
“ఇంక అందరూ నెమ్మదిగా కళ్ళు తెరవండి”,అన్నారు.
ఒక్కొక్కరు నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నారు. కానీ కళ్ళు మూసుకొని పోతున్నాయి. ఒకరో ఇద్దరో తప్ప అందరికి మత్తుగా, అంతే గాక హాయిగా ఉన్నది అంత హాయి వారికి అసలు ఇంతకూ ముందు ఉన్నట్లు అనిపించా లేదు.
“మీరేమి చేసినారు?ఇంట మత్తుగా యున్నది?” ఇద్దరు అడిగినారు.
“నేనేమీ చేయ లేదు. చేసేదేదో మీరే చేసుకున్నారు. ఇంక కథ లోకి వెళ్దామా?”
“ఒక ఆశ్రమ విద్యాలయములో ఒకడు శ్రద్ధగా అన్నీ నేర్చుకున్నాడు. ఇంక తను నేర్చుకోవలసినది ఏమీ లేదనుకున్నాడు. అదే మాట తన గురువుతో చెప్పినాడు.
గురువు అన్నాడు,”నిజమే , నీవు అన్నీ నేర్చుకున్నావు. కానీ గుణ శర్మ నీ కంటే ఘటికుడు.”
“అతడికంటే నేను కూడా నేర్చుకున్నాను కదా. నిజానికి ఇంకా ఎక్కువే నేర్చుకున్నాను.”
“అయితే ఒక సారి తోట పల్లికి వెళ్లి, అక్కడ తోటలలో పనిచేస్తున్న వారికి చదవడము, వ్రాయడము నేర్పించి రా. తరువాత ఎవరు గొప్ప వారో చూద్దాము “, అన్నారు,గురువుగారు.
శిష్యుడు అలాగే వెళ్లి, మూడు నెలలు ఉండి, తిరిగి వచ్చినాడు.
“అక్కడ తోటల్లో పని చేసే వారు ఉత్త మూర్ఖులు.ఒక్కరిని కూడా కుదురుగా కూర్చో బెట్టి ఏమీ నేర్ప లేక పోయినాను.”, అని అన్నాడు.
తిరిగి,”గుణ శర్మ కూడా అక్కడికి వెళ్లి వాళ్లకు ఏమీ నేర్ప లేక పోయినాడుట కదా.”, అని అన్నాడు.
“ఔను.” ఆన్నారు గురువుగారు.
“అయితే గుణ శర్మ నా కంటే ఏ విధముగా గొప్ప వాడు?”,తిరిగి ప్రశ్నించినాడు.
“మరి నీవా సమయములో ఏమి చేసినావు?”
“చేయడానికి ఏముంది?వారి చుట్టూ తిరుగుతూ ప్రయత్నము చేస్తూనే యున్నాను. వారికి చదవడము, వ్రాయడము నేర్పించాలని.”
“మరి వాళ్ళు పగలంతా పనిలోనే యుంటారు కదా. అందుకని గుణ శర్మ సాయంత్రము, రాత్రి వారు పండుకొనే వరకు ఈ పనిలో యుండే వాడు. మిగిలిన సమయములో అక్కడ పంటలు వేసే పద్ధతులు, అవి పెరిగే పధ్ధతి శాస్త్రీయముగా గమనించి వ్యవసాయ పద్ధతులపై ఒక పుస్తకమే వ్రాసినాడు. ఆ పుస్తకము ఇప్పుడు పెద్ద వారి చేత బాగా మన్ననలను పొందింది తెలుసా? తను ఒకరికి నేర్పుటకు ప్రయత్నము చేయడమే కాదు. కాలాన్ని వృధా చేయకుండా తను కూడా నేర్చుకుంటూనే యున్నాడు. తను నేర్చుకున్న దాన్ని ముందు తరాలకు అండ చేయటానికి పుస్తక రూపములో తీసుకొని వస్తున్నాడు.” వెంటనే ఆ శిష్యుడికి తనలో లోపమేమిటో తెలియ వచ్చినది. గుణ శర్మ తన కంటే చాలా గొప్ప వాడని వెంటనే ఒప్పుకున్నాడు. ఈ కథ మీకు అర్థమయిందా?”స్వామిజి ప్రశ్నించినాడు. ఎవరినుండీ జవాబు రాలేదు.
ఇంక అసలు విషయానికి వస్తాను.చెరువు అడుగున ఎమున్నదీ తెలియాలంటే నీరు కలక తేరి యుండాలి. ఈ విషయము అర్థము కావాలంటే మనస్సు ప్రశాంతత తో యుండాలి.మిమ్ములను మీరు ఉదయము నుండి పరిశీలించుకొనుట వలన మీలో కొంత ప్రశాంతత ఏర్పడింది, కాస్త మత్తు కుడా కలిగింది. అందుకో తనను తానూ పరిశీలించుకొనుట అలవాటు చేసుకోవాలి.  ఈ పద్ధతిని బుద్ధుడు ఎక్కువగా వాడినాడు. తనను తాను పరిశీలించుకొని తను ఎవరో తెలుసు కోవాలని రమణ మహర్షి చెప్పినాడు. ఆ స్థితి వచ్చే వరకు తన వాదనే సరి అయినదని అనుకుంటాడు,ఎదుటి వారు చెప్పినది వినడము అర్థము కాదు. అందుకే మీ చేత ఈ ధ్యానము చేయించినాను. నీలో, నాలో యుండే దేవుడు ఒక్కడే అయినప్పుడు మరొక దేవుడి విగ్రహము పెట్టి పూజ చేయ వలసిన అవసరమేమిటి? ఇదే మీ ప్రశ్న. జీవితములో సంవత్సరాలు గడిచే కొద్దీ మనకు ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. వాటిని కొంత మంది అసలు పట్టించుకోరు.కొంత మంది వాటి నుండి పాఠాలను నేర్చుకుంటారు. నేర్చుకున్న ప్రతి పాఠము వారి సంస్కారాన్ని పెంచ్తుంది.అంటే, వారు మిగిలిన వారి కంటే వేగముగా ముందుకు ప్రయాణము చేస్తారు. మిగిలిన వారు వెనుక పడతారు. ముందు వెళ్ళిన వారు తమ లక్ష్యము చేరుకొన్న తరువాత వెనుక బడిన వారిని నడిపించుటకు తిరిగి వస్తారు. ఇదంతా ఒక జన్మలో జరగదు.”
ఇంతలో, “మళ్ళీ జన్మలు ఉంటాయని అంటున్నారా?ఇది ఎలా నమ్మాలి? “ఒకరు అడిగినారు.
“ప్రస్తుతానికి నమ్మ వలసిన అవసరము లేదు. ఆ విషయము వివరముగా మరో సారి మాట్లాడుకుందాము. ఈ విధముగా మన కోసము వచ్చిన వారినే మహాత్ములు లేదా గురువులు అని అంటున్నాము. మరో విషయము. ఈ మొత్తము విశ్వాన్ని నడిపించే అద్భుతమయిన గుణాలలో ఒకటి ప్రేమ. మరొకటి కృతజ్ఞత. మొదటిది ఆ మహాత్ములు మనకు చూపించేది. రెండవది వారి యెడల మనకు ఉండ వలసినది.”
“మళ్ళీ మళ్ళీ వారిని గుర్తుకు తెచ్చుకుంటే వారు చెప్పిన విషయాలు మనకు గుర్తుంటాయి.అందుకే వారి రూపాలను మన ఎదురుగా ఉంచుకుంటే వారు చెప్పిన మంచి మనలో మెదులుతూ మనలను నడిపిస్తూ యుంటుంది. అంటే గాని, వారి పేరు చెప్పి ఇంకొకరితో యుద్ధాలు చేయాలని చెప్పిన వారు పరమ మూర్ఖులు.”
“కొన్ని ప్రత్యెక మయిన సందర్భాలలో జనము వారిని గుర్తు చేసుకోవడానికి కలిసినపుడు అది ఒక తిరునాళ్ళ అవుతుంది. అంతే కాదు ఆ సమయాల్లో ఎంతో మందికి జీవనోపాధి కూడా దొరుకుతుంది. మీ ప్రశ్నలకు కొద్ది  సమాధానాలు దొరికినాయనుకుంటాను. ఇంకా ఏమయినా ప్రస్నాలున్నయా?”
“ప్రశ్నలు చాలా ఉన్నాయి.  మేము మళ్ళీ వచ్చి మిమ్ములను అడుగ వచ్చునా?” వాళ్ళు అడిగినారు.
“మిగిలిన కార్యక్రమాలకు భంగము రాకుండా మీరు ఎప్పుడయినా రా వచ్చును. అంతే కాదు ఎటువంటి ప్రశ్నలయినా వేయ వచ్చును, విషయము తెలుసుకోవడానికి. మీరు అందరూ మా వాళ్ళే. సరేనా.”
“మరి, ఇంకో కథ చెబుతామన్నారు.”
‘కథల కేముంది? ఇంకో మారు చెప్పుకుందాము.”
“ఇంతకూ దేవుడి గూర్చి చెప్పా లేదు.”
“ఇప్పుడు నేను చెప్పినది ఆలోచించి, అప్పుడు మళ్ళీ ప్రశ్న వేయండి. అప్పుడు మళ్ళీ చెబుతాను.”
అందరూ ప్రశాంతముగా వెళ్లి పోయినారు.
“వీరికి చాలా చెప్పారండీ స్వామీజీ!” ఒక దేవాలయ కార్య కర్త అన్నారు.
“దారి తప్పిన వారికే ఎక్కువ చెప్పాలి, మిగిలిన వారికంటే”, అన్నారు స్వామిజి.



No comments:

Post a Comment