విగ్రహారాధన అవసరాన్ని గురించి కొంత మంది వివరిస్తే,
నిరాకారుడయిన పరమాత్మను ఆకారముతో ఏ విధముగా సూచిస్తాము?అని గట్టిగా వాదించే
వాళ్ళున్నారు. ఈ విషయములో పెద్దలు చెప్పిన ఒక కథ యున్నది.
ఒక కాకి రోజంతా తిరిగి, తిని, బాగా అలసిపోయినది. ఒక చెట్టు
మీద కూర్చొని నిద్ర పోయినది. ఇంతలో ఒక వరద వచ్చినది. ఆ వరదలో చెట్టు కొట్టుకొని పోయినది. కొమ్మలను
గట్టిగా పట్టుకొని నిద్ర పోతున్న ఆ కాకికి ఏ మాత్రము మెలకువ రాలేదు. సుర్యోదయమయి,
వెలుతురు వచ్చిన తరువాత కాకి కళ్ళు తెరిచినది.ఎటు చూచినా నీరు. కాకికి భయము
వేసినది. తను చెట్టుమీద యున్న విషయము కూడా మరిచి పోయినది. తూర్పు వైపు చాలా దూరము
ఎగిరినది.నేల కనిపించ లేదు.వెనుకకు తిరిగి వచ్చినది. దక్షిణము వైపుకు వెళ్ళినది.
నేల కనిపించక తిరిగి మళ్ళీ నీళ్ళపై తేలి పోతున్న చెట్టు మీదికి చేరినది. అదే
విధముగా పడమర మరియు ఉత్తరము వెళ్లి తిరిగి వచ్చినది. బాగా అలసి పోయినది. ఇంకా
దిక్కు తోచక ఆ నీళ్ళలో కొట్టుక పోతున్న చెట్టు మీదేయుండి పోయినది. మధ్యాహ్నానికి,
ఆ చెట్టు ఒక చోట గట్టును చేరినది. ఆ కాకి వెంటనే చెట్టును వదిలి వేసి ఎగిరి పోయినది.
ఒక ధ్యానికి మొదట్లో ఆ కాకికి చెట్టు లాగానే ఒక ఆలంబన కావలసి
యుంటుంది. దైవము మీద దృష్టి నిలబడిన తరువాత విగ్రహము యొక్క అవసరము యుండదు.
కృష్ణుడే ఎదురుగా నిలబడి యుంటే కృష్ణుడి విగ్రహముతో అవసరము ఏముంటుంది? మీ అంతరంగ
ప్రయాణానికి మొదట ఒక ఆలంబన కావలసి యుంటుంది. ఆ అలంబనే విగ్రహము లేదా గుర్తు.
అగ్ని కీలల మెడ కూడా
ధ్యానము చేయ వచ్చును. మొదట మంటను చూచి, కనులు మూసుకొని, దానిని జాగ్రత్తగా
గమనించాలి.
(ఇది స్వామి సత్యానంద
సరస్వతి చెప్పినది)
No comments:
Post a Comment