సారపు ధర్మమున్ విమల సత్యము
పాపము చేత బొంకు చే
పారము పొందలేక చెడ బారిన
దైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష చేసిరది వారల
చేటగు గాని ధర్మ వి
స్తారకమయ్యు సత్య శుభ దాయక
మయ్యు ప్రశస్తి గాంచెడున్.
ధర్మము, సత్యము, పాపము చేత అబద్ధము చేత గట్టుకు చేర లేక చెడిన
స్థితిలో యున్నప్పుడు సమర్థులయిన వారు దానిని ఉపేక్ష భావముతో చూచినపుడు, అది
ఖచ్చితముగా వారికి చెడు గా పరిణమిస్తుంది.
ధర్మము, సత్యము తిరిగి ప్రతిస్థించ బడుతుంది.
ఇది యుగ పురుషుడయిన శ్రీ కృష్ణ పరమాత్మ సభా వేదిక మీద ధృత
రాష్ట్రునికి ఇచ్చిన సందేశము. మంచి చేయ గలిగి కూడా ఉపేక్ష
చేసినపుడు ఫలితము ఎలా ఉంటుందో (ఒక హెచ్చరిక లాగా) సూచించినాడు.
ఇక్కడ మరో విషయము
కుడా చెప్పవలసి యుంటుంది. ఒక చిన్న పిల్ల వాడు పరాయి వాళ్ళ తోటలో
తోట కూర దొంగ తనము చేసి,
ఇంటికి కూర తెస్తే, వాళ్ళమ్మ “ఎక్కడినుండి తెచ్చినావు ?“ అని కూడా అడగకుండా “ ఈ రోజు కూర ఖర్చు
తగ్గినది” ,అని సంతోష పడడమే కాకుండా, మెచ్చుకుంటుంది. అంతే గాక తరువాత వాడు ఎలా తయారవుటాడని ఆలోచించదు.
చాలా కాలము తరువాత ఒక పెద్ద దోపిడీ లో
పట్టుబడి కొడుకు వెళ్ళుతుంటే, వాడిని పట్టుకొని ఏడుస్తుంది.
అప్పుడు ఆమె కొడుకు “తోట కూర దొంగ తనము నాదే చెప్పి యుంటే నేను ఇలా తయారయే వాడిని
కాదు.” అని, తల్లిని చీదరించు కుంటాడు.
ఈ కథ ఇప్పటి వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతుంది. మరొక సంఘటన.
“నీవు అధర్మము చేస్తున్నట్లు నీకు తెలియదా?” అని అడిగితే,
“నాకు ధర్మమూ యొక్క స్వరూపము తెలుసు. అధర్మము యొక్క స్వరూపము తెలుసు. నేను
చేస్తున్నదీ, తెలుసు. కానీ నా మనస్సు అధర్మము వైపు పోకుండా నియంత్రించు కోలేక
పోతున్నాను” అని అంటాడు. ఇదేలాగుందంటే సిగరెట్ త్రాగితే కాన్సర్ వస్తుందని తెలిసి
కూడా సిగరెట్ త్రాగుట నియంత్రించు కోలేని
నేటి మానవుడి పరిస్థితిని సూచిస్తుంది. అందుకే ముందు మనస్సునునియంత్రించుకోా వలసిన
అవసరము ఏంతో యున్నది.
ఈ బలహీనతకు చుట్టూ యున్న సామాజిక వాతావరణము కొంత కారణము అయితే
మనము ఎన్నుకొన్న మిత్రులు కొంత కారణము అవుతారు. అంటే గాక వ్యక్తీ యొక్క పరిణామ
స్థితి కూడా దీనికి బలమిస్తుంది. వ్యక్తీ తప్పు దారిలో వెళ్ళుతున్నప్పుడు అతడికి ఆ
విషయము గుర్తు చేయ వలసిన అతడి శ్రేయోభిలాషులకు, బందువులకు యుంటుంది. ఈ భాద్యతను
నిర్లక్ష్యము చేస్తే ఎలా యుంటుంది అనేది కూడా పై పద్యము సూచిస్తుంది.
సహాయము లేక రహదారిలో నిస్సహాయముగా పది యున్న వ్యక్తిని పట్టించుకోలేని వ్యక్తీ తన ఇంట్లో తన వాళ్ళకు అదే రకముగా సేవ చేయ వలసిన
పరిస్థితులను కల్పించుకుంటాడని మాస్టర్ ఇకె గారు చెబుతారు. ఇదే మనకు ప్రక్రుతి
సమాజ భాద్యతను గుర్తు చేసే పధ్ధతి.
---------------------------------------------------
పినాకినీ నది ఒడ్డున రామ తీర్థము అనే గ్రామము. అందులో నీలకంథ మహాదేవుడి పేరా శివాలయము.
కొన్ని తరాలుగా దాన్ని
కట్టించిన వంశములోని వారే దానిని నిర్వహిస్తున్నారు. ఆ వంశము లోని వారే శివానంద
స్వామి. సన్యాసము తీసుకున్న తరువాత దేసమంతటా తిరుగుతూ తన పూర్వీకులు కట్టించిన ఆ
గుడిలో సంవత్సరానికి కనీసము ఒక నెల యుంటారు.ఆయన వచ్చినపుడు చుట్టు ప్రక్కల
జిజ్ఞాసువులకు ఏంటో ఉత్సాహము కలుగుతుంది. ఆయన కూడా అదే ఉత్సాహముతో వారి సందేహాలను
తీరుస్తూ ఉంటారు. ఇది ఆయన తన భాద్యతగా తీసుకున్నారు.
No comments:
Post a Comment